Rammohan Naidu: డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల పోలవరం, అమరావతి, రైల్వే జోన్ పనుల్లో స్పీడ్ పెరిగింది..
- డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏపీలో అభివృద్ధి పనులకు నిధులు..
- రూ. 12 లక్షల వరకు నో ట్యాక్స్ అన్నది చారిత్రాత్మక నిర్ణయం..
- కేంద్రం ప్రవేశ పెట్టింది ప్రజా సంక్షేమ బడ్జెట్: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Rammohan Naidu: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రూ. 12 లక్షల వరకూ మధ్య తరగతి ప్రజలకి ఆదాయపు పన్నులో ఊరట ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల పోలవరం, అమరావతి, రైల్వే జోన్ పనులు స్పీడ్ అందుకున్నాయి.. గత ప్రభుత్వం చేసిన పాలనతో రాష్ట్రం అధోగతి పాలైంది.. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందని ఆయన వెల్లడించారు. అలాగే, జల్ జీవన్ మిషన్ కోసం కేంద్రం 15 వేల కోట్లు ఇచ్చినా సరైన పైప్ లేన్లు వేయలేకపోవడం గత ప్రభుత్వం చేసిన తప్పిదమని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు దీనిపై ప్రత్యేక కార్యక్రమం ప్రణాళిక చేస్తున్నాం.. రైతులకు అండగా ఉంటున్నాం.. స్టార్టప్ లు ప్రారంభించే యువతకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.
Read Also: Ambati Rambabu: ముద్రగడ ఇంట్లో భయానక వాతావరణం సృష్టించారు..
Also Read
- CM Chandrababu: ప్రజలకు ఇదే నా హామీ.. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచం!
- Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
- Venkata Krishnapuram Crime: లీడ్ కనుక్కునేందుకు ఎవ్వరూ ప్రాణాలతో లేరు.. వెంకటకృష్ణపాలెంలో విషాదంపై పుత్తూరు డీఎస్పీ!
- Off The Record : పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య మంటలు
ఇక, సివిల్ యావియేషన్ లో ఉడాన్ స్కీంను పొడింగింపుతో పాటు ఇతర దేశాల్లో కూడా వర్తింపు చేస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. గతంలో కేంద్రంలో వైసీపీ ప్రభుత్వం భాగస్వామి అయినా విశాఖ రైల్వే జోన్ కు ల్యాండ్ కేటాయించలేదు.. అలాగే, అమరావతి, పోలవరంకు నిధులు తేలేకపోయారు అని ఆరోపించారు. ఉడాన్ స్కీం దేశమంతా వచ్చేలా చూస్తున్నాం.. అన్ని ఎయిర్ పోర్టులలో కార్గో ఫెసిలిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.. లోకల్ ప్రోడెక్టును కార్గో ద్వారా రవాణా జరిగిలే చర్యలకు ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన పేర్కొన్నారు. ఎన్డీయే తరపున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారని తెలిపారు. చాలా మంది తెలుగువారు ఢిల్లీలో ఉన్నారు.. వారి ఓటు మాకు ఎంతో ముఖ్యం అందుకోసమే చంద్రబాబుని ఎన్డీయే సర్కార్ ఆహ్వానించిందన్నారు. ఢిల్లీని ఓ మోడల్ సిటిగా మార్చాలన్నదే మోడీ సంకల్పం అని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ప్రజలకు ఇదే నా హామీ.. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచం!
-
IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
-
Geetha MAdhuri : నేను నోరు తెరిస్తే తట్టుకోలేరు.. కాపురాలు కూలిపోవడం ఖాయం..
-
Tamil Nadu Elections 2026: ఓటు హక్కు వినియోగించుకున్న సూర్య-జ్యోతిక జంట!
-
West Bengal Elections: రణరంగంగా బెంగాల్.. తొలి దశలోనే రక్తపాతం.. బాంబు దాడులు, దహనకాండ!
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?