Rammohan Naidu: డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల పోలవరం, అమరావతి, రైల్వే జోన్ పనుల్లో స్పీడ్ పెరిగింది..
- డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏపీలో అభివృద్ధి పనులకు నిధులు..
- రూ. 12 లక్షల వరకు నో ట్యాక్స్ అన్నది చారిత్రాత్మక నిర్ణయం..
- కేంద్రం ప్రవేశ పెట్టింది ప్రజా సంక్షేమ బడ్జెట్: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rammohan Naidu: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రూ. 12 లక్షల వరకూ మధ్య తరగతి ప్రజలకి ఆదాయపు పన్నులో ఊరట ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల పోలవరం, అమరావతి, రైల్వే జోన్ పనులు స్పీడ్ అందుకున్నాయి.. గత ప్రభుత్వం చేసిన పాలనతో రాష్ట్రం అధోగతి పాలైంది.. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందని ఆయన వెల్లడించారు. అలాగే, జల్ జీవన్ మిషన్ కోసం కేంద్రం 15 వేల కోట్లు ఇచ్చినా సరైన పైప్ లేన్లు వేయలేకపోవడం గత ప్రభుత్వం చేసిన తప్పిదమని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు దీనిపై ప్రత్యేక కార్యక్రమం ప్రణాళిక చేస్తున్నాం.. రైతులకు అండగా ఉంటున్నాం.. స్టార్టప్ లు ప్రారంభించే యువతకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.
Read Also: Ambati Rambabu: ముద్రగడ ఇంట్లో భయానక వాతావరణం సృష్టించారు..
Also Read
- Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో పిల్
- Pawan Kalyan: పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్.. 25 మంది పరిశీలకుల ప్రకటన
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. రూ.30,515 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త ఊపు..!
- Minister Ramprasad Reddy: ఇక డీజిల్ బస్సులకు గుడ్బై..! త్వరలో 700 ఎలక్ట్రిక్ బస్సులు..
ఇక, సివిల్ యావియేషన్ లో ఉడాన్ స్కీంను పొడింగింపుతో పాటు ఇతర దేశాల్లో కూడా వర్తింపు చేస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. గతంలో కేంద్రంలో వైసీపీ ప్రభుత్వం భాగస్వామి అయినా విశాఖ రైల్వే జోన్ కు ల్యాండ్ కేటాయించలేదు.. అలాగే, అమరావతి, పోలవరంకు నిధులు తేలేకపోయారు అని ఆరోపించారు. ఉడాన్ స్కీం దేశమంతా వచ్చేలా చూస్తున్నాం.. అన్ని ఎయిర్ పోర్టులలో కార్గో ఫెసిలిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.. లోకల్ ప్రోడెక్టును కార్గో ద్వారా రవాణా జరిగిలే చర్యలకు ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన పేర్కొన్నారు. ఎన్డీయే తరపున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారని తెలిపారు. చాలా మంది తెలుగువారు ఢిల్లీలో ఉన్నారు.. వారి ఓటు మాకు ఎంతో ముఖ్యం అందుకోసమే చంద్రబాబుని ఎన్డీయే సర్కార్ ఆహ్వానించిందన్నారు. ఢిల్లీని ఓ మోడల్ సిటిగా మార్చాలన్నదే మోడీ సంకల్పం అని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
-
Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
-
T20 World Cup: ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. ‘వెళ్లి షాపింగ్, హోటల్లో డిన్నర్లు చేసుకోండి’..
-
Chairman’s Desk: అసలు ప్రభుత్వాల బాధ్యతేంటి..? పార్టీలు చేస్తున్న పనేంటి..?
-
Off The Record: ట్రాప్లో పడుతున్నామా? కూటమిలో చర్చ
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!