Margani Bharat: ముఖ్యమంత్రుల భేటీలో ఏ ఒక్క ప్రధాన అంశానికి పరిష్కారం లభించలేదు..
- తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై స్పందించిన మాజీ ఎంపీ..
- ఈ సమావేశంలో ఏ ఒక్క ప్రధాన అంశానికి పరిష్కారం దొరకలేదు..
- పూర్తిస్థాయిలో రెండు రాష్ట్రాల నేతలు వివరణ ఇవ్వాలి: మార్గాని భరత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharat: రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక ఆహ్వానించ దగ్గ పరిణామం అన్నారు. ఏ ఒక్క ప్రధాన అంశానికి పరిష్కారం లభించలేదు.. నదీ జలాలకు సంబంధించి ఇప్పటికే కమిటీలు ఉన్నాయి ఇంకా కొత్త కమిటీలు దేనికి.. షీలా బిడే కమిటీని ఎందుకు మర్చిపోయారు.. ఏపీ రీ-ఆర్గనైజేషన్ చట్టం ప్రకారం 10 సంవత్సరాలు మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వర్తిస్తుంది.. మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి కాపిటల్ గా పొడిగించాలి.. టీడీపీ ఎంపీలు ఎవరు ఈ భేటీ గురించి మాట్లాడలేదు అని మాజీ ఎంపీ అన్నారు. ఇక, భద్రాచలం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలు ప్రధాన పోర్టుల్లో భాగస్వామ్యం కావాలని తెలంగాణ నేతలు అడిగినట్లు తెలుస్తోంది.. వీటిపై పూర్తిస్థాయిలో రెండు రాష్ట్రాల నేతలు వివరణ ఇవ్వాలి అని మార్గాని భరత్ డిమాండ్ చేశారు.
Read Also: Leopard Roaming In Mahanandi : చిరుత దెబ్బకి కంటికి కునుకు లేకుండా జాగారణ చేస్తున్న జనం..
Also Read
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన లవిద్యుత్ బకాయిల గురించి ఏమాత్రం చర్చ జరగనట్టే తెలుస్తోంది అని మాజీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భారత్ ఆరోపించారు. కేంద్ర పెద్దల మధ్యవర్తిత్వం లేకుండా జరిగిన ఈ సమావేశానికి ఎంత మేర గుర్తింపు ఉంటుంది.. టీడీపీ నేతలు గుట్టల కొద్దీ తీసుకున్న ఇసుకను అక్రమంగా అమ్ముకున్నారు.. రాజ్యాంగం మీద ఒట్టేసి ఎన్ని గుట్టల ఇసుక అమ్ముకున్నారో రాజమండ్రి ఎమ్మెల్యే చెప్పాలి అని డిమాండ్ చేశారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాటలు గౌరవంగా మాట్లాడాల్సి ఉంటుంది.. నా వాహనం దగ్ధానికి సంబంధించి నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టు.. నిన్ను నువ్వు ఆధికంగా ఊహించుకోకు.. పవన్ కళ్యాణ్ చరిష్మాతో గెలుచావు.. నీ బఫూన్ ఫేస్ చూసి ఎవరు ఓటు వేయలేదు అని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: MS Dhoni Hairstyle: ప్రపంచం మెచ్చిన హెయిర్ స్టైల్ను ఆమె కోసమే కట్ చేయించాడు!
అయితే, నువ్వు ఎవరో రాజమండ్రికి పెద్దగా తెలియదు అని మార్గాని భరత్ చెప్పుకొచ్చారు. నువ్వు పెట్టిన లైవ్ 12 వేల మంది చూస్తే.. నేను పెట్టిన లైవ్ ఐదు లక్షల మంది చూశారు.. అది నీ రేంజ్, ఇది నా రేంజ్ అని విమర్శించారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పథకం ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ కాలేదు.. అద్భుతంగా డెవలప్ చేసిన కంబాల చెరువును నాశనం చేశారు.. నా ఎంపీ నిధులతో ఎన్నో అద్భుతమైన అభివృద్ధి పనులు చేపట్టాను.. కనీసం వాటి కొనసాగింపైనా పూర్తిస్థాయిలో జరిగే విధంగా చూసుకో అని మార్గాని భరత్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!