Margani Bharat: ముఖ్యమంత్రుల భేటీలో ఏ ఒక్క ప్రధాన అంశానికి పరిష్కారం లభించలేదు..
- తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై స్పందించిన మాజీ ఎంపీ..
- ఈ సమావేశంలో ఏ ఒక్క ప్రధాన అంశానికి పరిష్కారం దొరకలేదు..
- పూర్తిస్థాయిలో రెండు రాష్ట్రాల నేతలు వివరణ ఇవ్వాలి: మార్గాని భరత్
Margani Bharat: రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక ఆహ్వానించ దగ్గ పరిణామం అన్నారు. ఏ ఒక్క ప్రధాన అంశానికి పరిష్కారం లభించలేదు.. నదీ జలాలకు సంబంధించి ఇప్పటికే కమిటీలు ఉన్నాయి ఇంకా కొత్త కమిటీలు దేనికి.. షీలా బిడే కమిటీని ఎందుకు మర్చిపోయారు.. ఏపీ రీ-ఆర్గనైజేషన్ చట్టం ప్రకారం 10 సంవత్సరాలు మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వర్తిస్తుంది.. మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి కాపిటల్ గా పొడిగించాలి.. టీడీపీ ఎంపీలు ఎవరు ఈ భేటీ గురించి మాట్లాడలేదు అని మాజీ ఎంపీ అన్నారు. ఇక, భద్రాచలం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలు ప్రధాన పోర్టుల్లో భాగస్వామ్యం కావాలని తెలంగాణ నేతలు అడిగినట్లు తెలుస్తోంది.. వీటిపై పూర్తిస్థాయిలో రెండు రాష్ట్రాల నేతలు వివరణ ఇవ్వాలి అని మార్గాని భరత్ డిమాండ్ చేశారు.
Read Also: Leopard Roaming In Mahanandi : చిరుత దెబ్బకి కంటికి కునుకు లేకుండా జాగారణ చేస్తున్న జనం..
Also Read
- AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
- Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన లవిద్యుత్ బకాయిల గురించి ఏమాత్రం చర్చ జరగనట్టే తెలుస్తోంది అని మాజీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భారత్ ఆరోపించారు. కేంద్ర పెద్దల మధ్యవర్తిత్వం లేకుండా జరిగిన ఈ సమావేశానికి ఎంత మేర గుర్తింపు ఉంటుంది.. టీడీపీ నేతలు గుట్టల కొద్దీ తీసుకున్న ఇసుకను అక్రమంగా అమ్ముకున్నారు.. రాజ్యాంగం మీద ఒట్టేసి ఎన్ని గుట్టల ఇసుక అమ్ముకున్నారో రాజమండ్రి ఎమ్మెల్యే చెప్పాలి అని డిమాండ్ చేశారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాటలు గౌరవంగా మాట్లాడాల్సి ఉంటుంది.. నా వాహనం దగ్ధానికి సంబంధించి నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టు.. నిన్ను నువ్వు ఆధికంగా ఊహించుకోకు.. పవన్ కళ్యాణ్ చరిష్మాతో గెలుచావు.. నీ బఫూన్ ఫేస్ చూసి ఎవరు ఓటు వేయలేదు అని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: MS Dhoni Hairstyle: ప్రపంచం మెచ్చిన హెయిర్ స్టైల్ను ఆమె కోసమే కట్ చేయించాడు!
అయితే, నువ్వు ఎవరో రాజమండ్రికి పెద్దగా తెలియదు అని మార్గాని భరత్ చెప్పుకొచ్చారు. నువ్వు పెట్టిన లైవ్ 12 వేల మంది చూస్తే.. నేను పెట్టిన లైవ్ ఐదు లక్షల మంది చూశారు.. అది నీ రేంజ్, ఇది నా రేంజ్ అని విమర్శించారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పథకం ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ కాలేదు.. అద్భుతంగా డెవలప్ చేసిన కంబాల చెరువును నాశనం చేశారు.. నా ఎంపీ నిధులతో ఎన్నో అద్భుతమైన అభివృద్ధి పనులు చేపట్టాను.. కనీసం వాటి కొనసాగింపైనా పూర్తిస్థాయిలో జరిగే విధంగా చూసుకో అని మార్గాని భరత్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ క్యాబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
-
Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
-
Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!