Margani Bharat: ముఖ్యమంత్రుల భేటీలో ఏ ఒక్క ప్రధాన అంశానికి పరిష్కారం లభించలేదు..
- తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై స్పందించిన మాజీ ఎంపీ..
- ఈ సమావేశంలో ఏ ఒక్క ప్రధాన అంశానికి పరిష్కారం దొరకలేదు..
- పూర్తిస్థాయిలో రెండు రాష్ట్రాల నేతలు వివరణ ఇవ్వాలి: మార్గాని భరత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharat: రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక ఆహ్వానించ దగ్గ పరిణామం అన్నారు. ఏ ఒక్క ప్రధాన అంశానికి పరిష్కారం లభించలేదు.. నదీ జలాలకు సంబంధించి ఇప్పటికే కమిటీలు ఉన్నాయి ఇంకా కొత్త కమిటీలు దేనికి.. షీలా బిడే కమిటీని ఎందుకు మర్చిపోయారు.. ఏపీ రీ-ఆర్గనైజేషన్ చట్టం ప్రకారం 10 సంవత్సరాలు మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వర్తిస్తుంది.. మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి కాపిటల్ గా పొడిగించాలి.. టీడీపీ ఎంపీలు ఎవరు ఈ భేటీ గురించి మాట్లాడలేదు అని మాజీ ఎంపీ అన్నారు. ఇక, భద్రాచలం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలు ప్రధాన పోర్టుల్లో భాగస్వామ్యం కావాలని తెలంగాణ నేతలు అడిగినట్లు తెలుస్తోంది.. వీటిపై పూర్తిస్థాయిలో రెండు రాష్ట్రాల నేతలు వివరణ ఇవ్వాలి అని మార్గాని భరత్ డిమాండ్ చేశారు.
Read Also: Leopard Roaming In Mahanandi : చిరుత దెబ్బకి కంటికి కునుకు లేకుండా జాగారణ చేస్తున్న జనం..
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా తల్లికి వందనం వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన లవిద్యుత్ బకాయిల గురించి ఏమాత్రం చర్చ జరగనట్టే తెలుస్తోంది అని మాజీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భారత్ ఆరోపించారు. కేంద్ర పెద్దల మధ్యవర్తిత్వం లేకుండా జరిగిన ఈ సమావేశానికి ఎంత మేర గుర్తింపు ఉంటుంది.. టీడీపీ నేతలు గుట్టల కొద్దీ తీసుకున్న ఇసుకను అక్రమంగా అమ్ముకున్నారు.. రాజ్యాంగం మీద ఒట్టేసి ఎన్ని గుట్టల ఇసుక అమ్ముకున్నారో రాజమండ్రి ఎమ్మెల్యే చెప్పాలి అని డిమాండ్ చేశారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాటలు గౌరవంగా మాట్లాడాల్సి ఉంటుంది.. నా వాహనం దగ్ధానికి సంబంధించి నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టు.. నిన్ను నువ్వు ఆధికంగా ఊహించుకోకు.. పవన్ కళ్యాణ్ చరిష్మాతో గెలుచావు.. నీ బఫూన్ ఫేస్ చూసి ఎవరు ఓటు వేయలేదు అని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: MS Dhoni Hairstyle: ప్రపంచం మెచ్చిన హెయిర్ స్టైల్ను ఆమె కోసమే కట్ చేయించాడు!
అయితే, నువ్వు ఎవరో రాజమండ్రికి పెద్దగా తెలియదు అని మార్గాని భరత్ చెప్పుకొచ్చారు. నువ్వు పెట్టిన లైవ్ 12 వేల మంది చూస్తే.. నేను పెట్టిన లైవ్ ఐదు లక్షల మంది చూశారు.. అది నీ రేంజ్, ఇది నా రేంజ్ అని విమర్శించారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పథకం ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ కాలేదు.. అద్భుతంగా డెవలప్ చేసిన కంబాల చెరువును నాశనం చేశారు.. నా ఎంపీ నిధులతో ఎన్నో అద్భుతమైన అభివృద్ధి పనులు చేపట్టాను.. కనీసం వాటి కొనసాగింపైనా పూర్తిస్థాయిలో జరిగే విధంగా చూసుకో అని మార్గాని భరత్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా తల్లికి వందనం వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?