కుప్పంలో ఉద్రిక్తత…మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అరెస్ట్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుప్పం వేదికగా ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను అధికార, విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా జరిగిన గొడవతో టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేతలు ప్రచారం చేయకుండా అధికార పార్టీ కుట్రలు చేస్తోందంటూ.. డీజీపీకి లేఖ రాశారు చంద్రబాబు. కుప్పంలో టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు.
మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు టీడీపీ అధ్యక్షుడు నానిలను అదుపులోకి తీసుకున్నారు. కుప్పం మున్సిపల్ ఆఫీస్ వద్ద జరిగిన ఘటనలో 19 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో కొంత మందిని అరెస్ట్ చేయగా, తాజాగా కుప్పంలోని ఓ హోటల్లో బస చేసిన అమర్నాథ్ రెడ్డి, నానిలను అదుపులోకి తీసుకున్నారు. కుప్పం మున్సిపల్ పోరులో నామినేషన్లు విత్ డ్రా సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. నామినేషన్ విత్ డ్రా గడువు ముగిసినా, తుది జాబితా ప్రకటించలేదని టీడీపీ నేతలు ధర్నాకు దిగారు.
Also Read
అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మొత్తం కుప్పం మున్సిపాలిటీ బరిలో టీడీపీ 126నామినేషన్లు, వైసీపీ 89 ,కాంగ్రెసు పార్టీ 15, బిజెపి తరపున ఐదుగురు నామినేషన్లు వేసారు. నామినేషన్ విత్ డ్రా గడువు ముగిసినా, రాత్రి తొమ్మిది వరకు తుది జాబితా ప్రకటించకపోవడంపై టీడీపీ నేతలు మున్సిపల్ ఆఫీసుకు చేరుకొని ధర్నా చేశారు. దీనిపై పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్లు చేశారు. కుప్పంలో టీడీపీ నేతల అరెస్టుని చంద్రబాబు తప్పుబట్టారు. దీనిపై డీజీపీకి లేఖ రాశారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నానిలను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. నేతల అరెస్టులతో టీడీపీ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని, దీనికి పోలీసులు సహకరిస్తున్నారని చంద్రబాబు లేఖలో తెలిపారు. తప్పుచేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
-
Kangana Ranaut : సీక్రెట్గా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కంగనా
-
RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్గా నిలిచిన పాటిదార్ సేన..
-
Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
-
Motorola Edge 70 Pro+: మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ త్వరలో భారత్ లో విడుదల.. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 16GB RAM
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!