కుప్పంలో ఉద్రిక్తత…మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అరెస్ట్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుప్పం వేదికగా ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను అధికార, విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా జరిగిన గొడవతో టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేతలు ప్రచారం చేయకుండా అధికార పార్టీ కుట్రలు చేస్తోందంటూ.. డీజీపీకి లేఖ రాశారు చంద్రబాబు. కుప్పంలో టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు.
మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు టీడీపీ అధ్యక్షుడు నానిలను అదుపులోకి తీసుకున్నారు. కుప్పం మున్సిపల్ ఆఫీస్ వద్ద జరిగిన ఘటనలో 19 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో కొంత మందిని అరెస్ట్ చేయగా, తాజాగా కుప్పంలోని ఓ హోటల్లో బస చేసిన అమర్నాథ్ రెడ్డి, నానిలను అదుపులోకి తీసుకున్నారు. కుప్పం మున్సిపల్ పోరులో నామినేషన్లు విత్ డ్రా సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. నామినేషన్ విత్ డ్రా గడువు ముగిసినా, తుది జాబితా ప్రకటించలేదని టీడీపీ నేతలు ధర్నాకు దిగారు.
Also Read
- AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
- Tirumala Tirupati: తిరుమలలో ఎల్నినో ఎఫెక్ట్.. మరో 120 రోజులకు మాత్రమే నీళ్లు..
- Dussehra: శ్రీశైలం భ్రమరాంబికాదేవి క్షేత్రంలో దసరా మహోత్సవాలు.. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం..
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మొత్తం కుప్పం మున్సిపాలిటీ బరిలో టీడీపీ 126నామినేషన్లు, వైసీపీ 89 ,కాంగ్రెసు పార్టీ 15, బిజెపి తరపున ఐదుగురు నామినేషన్లు వేసారు. నామినేషన్ విత్ డ్రా గడువు ముగిసినా, రాత్రి తొమ్మిది వరకు తుది జాబితా ప్రకటించకపోవడంపై టీడీపీ నేతలు మున్సిపల్ ఆఫీసుకు చేరుకొని ధర్నా చేశారు. దీనిపై పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్లు చేశారు. కుప్పంలో టీడీపీ నేతల అరెస్టుని చంద్రబాబు తప్పుబట్టారు. దీనిపై డీజీపీకి లేఖ రాశారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నానిలను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. నేతల అరెస్టులతో టీడీపీ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని, దీనికి పోలీసులు సహకరిస్తున్నారని చంద్రబాబు లేఖలో తెలిపారు. తప్పుచేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!