Kolleru Flood water: కొల్లేరుకు పెరిగిన బుడమేరు వరద ఉధృతి.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్
- కొల్లేరుకు పెరిగిన బుడమేరు వరద ఉధృతి..
- నిన్నటి కంటే రెండు అడుగుల మేర పెరిగిన కొల్లేరు నీటి మట్టం..
- 15 గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. బిక్కు బిక్కుమంటున్న 44 లంక గ్రామాల్లోని ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Floods: కొల్లేరుకు బుడమేరు వాగు వరద ఉధృతి భారీగా పెరిగిపోయింది. నిన్నటి కంటే రెండు అడుగుల మేర కొల్లేరు నీటి మట్టం ఎక్కువ అయిందని అధికారులు చెప్తున్నారు. దీంతో 15 గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. కేవలం బోటు ద్వారానే కొల్లేరు పరిసర లంక గ్రామాల నుంచి పిల్లలు, వృద్ధులు బయటకు వస్తున్నారు. ఇక, ఏలూరు- కైకలూరు రోడ్డుపై నుంచి బుడమేరు వరద ప్రవాహం కొనసాగుతుంది. అయితే, ఇంకా కొల్లెరుకు వరద నీటి ఉదృతి పెరుగుతుందనే నేపథ్యంలో కొల్లేరు లంక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, వరద పెరిగితే మరిన్ని గ్రామాలు నీట మునిగి పోయే ప్రమాదం ఉంది. కొల్లేరు చుట్టూ ఉన్న 44 లంక గ్రామాల్లోని ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు.
Read Also: CommitteeKurrollu : కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎక్కడంటే..?
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
అయితే, ఏలూరు- కైకలూరు మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, కైకలూరు నుంచి ఏలూరు, ఏలూరు నుంచి కైకలూరు వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు తెలిపారు. చిన్న ఆడ్లగడ దగ్గర రహదారిపై నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండడంతో భారీ వాహనాలకు మాత్రమే అక్కడి నుంచి వెళ్లేందుకు పోలీసులు పర్మిషన్ ఇస్తున్నారు.
Read Also: Uttarpradesh : ఘోర ప్రమాదం.. రెండు కార్లు, ఈ రిక్షాలు ఢీ.. ఐదుగురు మృతి
మరోవైపు, బుడమేరు దగ్గర గండి పూడ్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బండరాళ్లను తెచ్చి గండ్లను అధికారులు పూడుస్తున్నారు. 100 మీటర్ల మేర పడిన మూడో గండిని పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. 50, 60 మీటర్ల మేర పడిన రెండు గండ్లను ఇప్పటికే పూడ్చేశారు. ఇక, మూడో గండి పూడ్చివేత పనులను హైదరాబాద్ నుంచి వెళ్లిన ఆర్మీ అధికారులు పరిశీలించారు. వంతెన వేసి గండిని పూడ్చాలని ఆర్మీ డైరెక్షన్ ఇచ్చింది. బుడమేరు గండ్ల పూడ్చివేత పనుల పర్యవేక్షణకు మూడు రోజుల నుంచి ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు మకాం వేశారు.
తాజావార్తలు
-
Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
-
CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!