Kolleru Flood water: కొల్లేరుకు పెరిగిన బుడమేరు వరద ఉధృతి.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్
- కొల్లేరుకు పెరిగిన బుడమేరు వరద ఉధృతి..
- నిన్నటి కంటే రెండు అడుగుల మేర పెరిగిన కొల్లేరు నీటి మట్టం..
- 15 గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. బిక్కు బిక్కుమంటున్న 44 లంక గ్రామాల్లోని ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Floods: కొల్లేరుకు బుడమేరు వాగు వరద ఉధృతి భారీగా పెరిగిపోయింది. నిన్నటి కంటే రెండు అడుగుల మేర కొల్లేరు నీటి మట్టం ఎక్కువ అయిందని అధికారులు చెప్తున్నారు. దీంతో 15 గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. కేవలం బోటు ద్వారానే కొల్లేరు పరిసర లంక గ్రామాల నుంచి పిల్లలు, వృద్ధులు బయటకు వస్తున్నారు. ఇక, ఏలూరు- కైకలూరు రోడ్డుపై నుంచి బుడమేరు వరద ప్రవాహం కొనసాగుతుంది. అయితే, ఇంకా కొల్లెరుకు వరద నీటి ఉదృతి పెరుగుతుందనే నేపథ్యంలో కొల్లేరు లంక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, వరద పెరిగితే మరిన్ని గ్రామాలు నీట మునిగి పోయే ప్రమాదం ఉంది. కొల్లేరు చుట్టూ ఉన్న 44 లంక గ్రామాల్లోని ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు.
Read Also: CommitteeKurrollu : కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎక్కడంటే..?
Also Read
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
అయితే, ఏలూరు- కైకలూరు మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, కైకలూరు నుంచి ఏలూరు, ఏలూరు నుంచి కైకలూరు వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు తెలిపారు. చిన్న ఆడ్లగడ దగ్గర రహదారిపై నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండడంతో భారీ వాహనాలకు మాత్రమే అక్కడి నుంచి వెళ్లేందుకు పోలీసులు పర్మిషన్ ఇస్తున్నారు.
Read Also: Uttarpradesh : ఘోర ప్రమాదం.. రెండు కార్లు, ఈ రిక్షాలు ఢీ.. ఐదుగురు మృతి
మరోవైపు, బుడమేరు దగ్గర గండి పూడ్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బండరాళ్లను తెచ్చి గండ్లను అధికారులు పూడుస్తున్నారు. 100 మీటర్ల మేర పడిన మూడో గండిని పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. 50, 60 మీటర్ల మేర పడిన రెండు గండ్లను ఇప్పటికే పూడ్చేశారు. ఇక, మూడో గండి పూడ్చివేత పనులను హైదరాబాద్ నుంచి వెళ్లిన ఆర్మీ అధికారులు పరిశీలించారు. వంతెన వేసి గండిని పూడ్చాలని ఆర్మీ డైరెక్షన్ ఇచ్చింది. బుడమేరు గండ్ల పూడ్చివేత పనుల పర్యవేక్షణకు మూడు రోజుల నుంచి ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు మకాం వేశారు.
తాజావార్తలు
-
Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
-
Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే ‘అగ్ని పరీక్ష’!
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
-
Jaipur Murder: ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లిని మాత్రమే కాదు, తండ్రిని కూడా చంపింది.!
-
Petrol Diesel Price Hike: వామ్మో.. ఒకేసారి రూ.13 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!