Kolleru Flood water: కొల్లేరుకు పెరిగిన బుడమేరు వరద ఉధృతి.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్
- కొల్లేరుకు పెరిగిన బుడమేరు వరద ఉధృతి..
- నిన్నటి కంటే రెండు అడుగుల మేర పెరిగిన కొల్లేరు నీటి మట్టం..
- 15 గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. బిక్కు బిక్కుమంటున్న 44 లంక గ్రామాల్లోని ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Floods: కొల్లేరుకు బుడమేరు వాగు వరద ఉధృతి భారీగా పెరిగిపోయింది. నిన్నటి కంటే రెండు అడుగుల మేర కొల్లేరు నీటి మట్టం ఎక్కువ అయిందని అధికారులు చెప్తున్నారు. దీంతో 15 గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. కేవలం బోటు ద్వారానే కొల్లేరు పరిసర లంక గ్రామాల నుంచి పిల్లలు, వృద్ధులు బయటకు వస్తున్నారు. ఇక, ఏలూరు- కైకలూరు రోడ్డుపై నుంచి బుడమేరు వరద ప్రవాహం కొనసాగుతుంది. అయితే, ఇంకా కొల్లెరుకు వరద నీటి ఉదృతి పెరుగుతుందనే నేపథ్యంలో కొల్లేరు లంక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, వరద పెరిగితే మరిన్ని గ్రామాలు నీట మునిగి పోయే ప్రమాదం ఉంది. కొల్లేరు చుట్టూ ఉన్న 44 లంక గ్రామాల్లోని ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు.
Read Also: CommitteeKurrollu : కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎక్కడంటే..?
Also Read
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
- Minister Anitha: హోంమంత్రి అనితకు స్వల్ప గాయం!
అయితే, ఏలూరు- కైకలూరు మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, కైకలూరు నుంచి ఏలూరు, ఏలూరు నుంచి కైకలూరు వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు తెలిపారు. చిన్న ఆడ్లగడ దగ్గర రహదారిపై నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుండడంతో భారీ వాహనాలకు మాత్రమే అక్కడి నుంచి వెళ్లేందుకు పోలీసులు పర్మిషన్ ఇస్తున్నారు.
Read Also: Uttarpradesh : ఘోర ప్రమాదం.. రెండు కార్లు, ఈ రిక్షాలు ఢీ.. ఐదుగురు మృతి
మరోవైపు, బుడమేరు దగ్గర గండి పూడ్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బండరాళ్లను తెచ్చి గండ్లను అధికారులు పూడుస్తున్నారు. 100 మీటర్ల మేర పడిన మూడో గండిని పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. 50, 60 మీటర్ల మేర పడిన రెండు గండ్లను ఇప్పటికే పూడ్చేశారు. ఇక, మూడో గండి పూడ్చివేత పనులను హైదరాబాద్ నుంచి వెళ్లిన ఆర్మీ అధికారులు పరిశీలించారు. వంతెన వేసి గండిని పూడ్చాలని ఆర్మీ డైరెక్షన్ ఇచ్చింది. బుడమేరు గండ్ల పూడ్చివేత పనుల పర్యవేక్షణకు మూడు రోజుల నుంచి ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు మకాం వేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్కు అసలు విలన్ ఎవరు.?
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!