కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వరదతో విజయవాడకు ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద తరలివస్తోంది. దీంతో.. మరోసారి ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉదృతి నెలకొంది. బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో 3,27,692 క్యూసెక్కులు కాగా.. కాలువలకు 14,692 క్యూసెక్కుల వరదనీరు తరలించారు. బ్యారేజ్ లెవల్ 12.0 కు చేరింది. 20 గేట్లను 8 అడుగుల మేర, 50 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. కృష్ణ నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేసారు.
కృష్ణాబేసిన్లోని శ్రీశైలం, నాగార్జున సాగార్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో పెద్ద ఎత్తున వరద నీరు దిగువకు చేరుతుండటంతో క్రమంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద పెరుగుతూ పోతోంది.. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కు వరద తాకిడి పెరిగింది, అప్రమత్తమైన అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు.. ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణా నది దిగువన, పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రతీ అరగంటకు నీటిమట్టం పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
GST: రైల్వే టికెట్, హోటల్ బుకింగ్ రద్దుపై జీఎస్టీ వడ్డింపు