GST: రైల్వే టికెట్, హోటల్ బుకింగ్ రద్దుపై జీఎస్టీ వడ్డింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. మీరు తరచూ రైల్వే టికెట్ బుక్ చేసుకుంటున్నారా? ఆ తర్వాత వాటిని క్యాన్సిల్ చేస్తున్నారా..? అయితే, ఇది మీకోసమే..! ఎందుకంటే.. అన్నింటినీ వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తెస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ను కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చింది.. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, ధృవీకరించబడిన రైలు టిక్కెట్లను రద్దు చేస్తే జీఎస్టీ చెల్లించాలి.. దీంతో, ఇప్పుడు టికెట్ క్యాన్సిలేషన్ మరింత ఖరీదు కానుంది.. అంటే.. బుకింగ్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ చార్జీల రూపంలో ఎక్కువ మొత్తం కట్ చేయనున్నారు.. రైల్వే టికెట్తో పాటు హోటల్ గది బుకింగ్ రద్దు చేసుకుంటే కూడా ఇది వర్తిస్తుంది.. ఇప్పటికే వాటిపై క్యాన్సిలేషన్ చార్జీలు ఉండగా.. ఇక నుంచి వాటిపై అదనంగా జీఎస్టీ రూపంలో కూడా కొంత మొత్తాన్ని వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Read Also: Nitin Gadkari: కాంగ్రెస్లో చేరాలని సన్నిహితుడి సలహా.. నితిన్ గడ్కరీ షాకింగ్ కామెంట్స్..
Also Read
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలోని ట్యాక్స్ రీసెర్చ్ యూనిట్ ఆగస్టు 3న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం, ఫస్ట్ క్లాస్ లేదా ఏసీ కోచ్ టిక్కెట్కు ఛార్జ్ చేయబడిన రద్దుపై 5 శాతం జీఎస్టీ వడ్డించనున్నారు.. అదే తరహాలో విమాన ప్రయాణం లేదా హోటల్ వసతిని రద్దు చేసినప్పుడు కూడా వర్తింపజేయనున్నారు.. టికెట్ క్యాన్సిలేషన్ చార్జీల రూపంలో సర్వీస్ ప్రొవైడర్లు కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నది అందుకే అన్నమాట.. ఒకసారి రైల్వే టికెట్, హోటల్ గది బుకింగ్ జరిగాక అది సర్వీస్ ప్రొవైడర్కు, కస్టమర్కు మధ్య ఒప్పందం కిందికే వస్తుంది.. దీంతో, బుకింగ్ను వినియోగదారుడు రద్దు చేసుకుంటే.. అది ఒప్పందం ఉల్లంఘన కిందికి రానుంది.. దీనికి ఫైన్ రూపంలో కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఎవరైనా నిర్దిష్ట తరగతి బుకింగ్లను రద్దు చేస్తే, ఆ తరగతికి సంబంధించిన సీట్లు మరియు బెర్త్లను బుకింగ్ చేయడానికి వర్తించే అదే జీఎస్టీ రేటు వర్తించబడుతుంది. ఉదాహరణకు, ఫస్ట్-క్లాస్ లేదా ఏసీ కోచ్లకు రేటు 5 శాతం..
ఉదాహరణకు 48గంటల ముందు ఎసీ ఫస్ట్క్లాస్ టికెట్ రద్దు చేసుకుంటే క్యాన్సిలేషన్ కింద రూ.240 వసూలు చేస్తే ఇక మీదట 5 శాతం జీఎస్టీని కలుపుకొని.. అంటే (240+12) మొత్తం రూ.252 వసూలు చేయనున్నారు.. అయితే, సెకండ్ క్లాస్ స్లీపర్ టికెట్ను రద్దు చేసుకుంటే మాత్రం ఎలాంటి జీఎస్టీ వర్తించదు అని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది కేంద్రం.
తాజావార్తలు
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..