Vellampally Srinivas: అమరావతి పేరుతో విజయవాడను మోసం చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు నుండి జగన్ననే మా భవిష్యత్తు కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా ప్రారంభమవుతుంది..ఏడు లక్షల మంది పార్టీ సైనికులు 1.65 లక్షల మందిని కలిసి ప్రజాసేకరణ చేయనున్నారు..గతంలో ఏ పార్టీ ఈ విధముగా చేయలేదు .. ఇప్పటికే గడప గడపకు కార్యక్రమం చేపట్టి లబ్దిదారుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నాం..జగన్ననే మా భవిష్యత్తు లో ప్రజల నుండి గత ప్రభుత్వ పాలనా ఇప్పుడు మా పాలన కు సంబంధించి వారి అభిప్రాయం తెలుసుకునే కార్యక్రమం..ఐదు అంశాలపై ప్రజల నుండి అభిప్రాయం సేకరించి వారు ఈ ప్రభుత్వంపై విశ్వాసం చూపితే వారి ఇంటికి వారి అనుమతితో మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ ను వారి ఇంటికి అంటిస్తారు..
గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ లు ఏర్పాటు చేసి ఏ విధంగా పరిపాలన అందించారో మనం చూసాం..మా ముఖ్యమంత్రి లబ్దిదారుడికి అర్హత ఉంటే చాలు వారికి నేరుగా పధకాలు అందజేయని చెప్పారు..అమరావతి పేరుతో విజయవాడ నగరాన్ని మోసం చేసారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు..2019 తర్వాత నగరంలో అభివృద్ధికి కోట్ల రుపాయలు కేటాయించి రోడ్లు, డ్రైయిన్ లు, పార్కు లు అభివృద్ధి చేశాం..గత ప్రభుత్వంలో విజయవాడ అభివృద్ధికి 450 కోట్ల రుపాయలు ఇస్తే అవి వేరే వాటికి మళ్లించి విజయవాడ ప్రజలను మోసగించారు..విజయవాడలో వరదలు వచ్చిన ఎటువంటి ముప్పు రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మించాం అన్నారు వెల్లంపల్లి.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
Read Also: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా.. మళ్లీ పెరగనున్న డీఏ
వినుకొండ ఎమ్మెల్యే సంచలన కామెంట్లు
వినుకొండ ఎమ్మెల్యే సంచలన కామెంట్లు చేశారు…. రాబోయే రోజుల్లో తన ప్రత్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడేలా ఎన్నికలు చేయబోతున్నానని కార్యకర్తలకు స్పష్టం చేశారు…. తాను ప్రాణాలను లెక్కచేయననీ, ప్రాణాలు పోతాయని భయపడనని ,నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరిగితేనే బాధపడతానని బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు…. సమయం వచ్చినప్పుడు తానేంటో చూపిస్తాను అని అంటున్నారు వినుకొండ ఎమ్మెల్యే. బ్రహ్మనాయుడు కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!