Ex DGP Sambasiva Rao: ఏపీలో కొత్త రాజకీయాలకు నాంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అసలేం జరుగుతోంది? గత కొంతకాలంగా కాపు నేతలు భేటీల మీద భేటీలు కావడం వెనుక ఆంతర్యం అదేనా? రాజకీయంగా వత్తిడి పెంచేందుకు ఒక వేదిక అవసరం అని భావిస్తున్నారా? తాజాగా విశాఖలో జరిగిన కాపు నేతల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీ పేరుతో ఒక సంస్థ ఆవిర్భావం జరిగిందని మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు ప్రకటించారు.
ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీ ఛైర్మన్ గా మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు ఎన్నికయ్యారు. బహుజన కాపు సామాజిక వర్గాలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వాతంత్రం కోసం ఫోరం ఫర్ బెటర్ ఏపీ పనిచేయబోతోంది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుగా పనిచేస్తుందన్నారు సాంబశివరావు. భవిష్యత్ లో రాజకీయ అజెండా తీసుకునే అవకాశం ఉందని, ఉత్తరాదిలో సామాజిక వర్గాల మధ్య జరిగిన కూర్పు లాంటి ప్రయోగంగా దీన్ని భావించవచ్చు అన్నారు.
Also Read
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ జరగాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే జిల్లాల వారీగా పర్యటనలు చేస్తామన్నారు. కాపు రిజర్వేషన్లు కంటే ఆర్ధిక,సామాజిక,రాజకీయ ఎదుగుదలే కీలకం అన్నారు సాంబశివరావు. బహుజన,కాపు, అగ్రవర్ణ పేదల కలయికతో కొత్త సమీకరణలు ప్రారంభం అవుతాయన్నారు. రాష్ట్రంలో కొత్త రాజకీయాలకు కావాల్సిన అంత చోటు ఉందని కాపునేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం వున్నందున ఫోరం ఫర్ బెటర్ ఏపీ తన కార్యాచరణను ప్రకటించే అవకాశం వుంది. మొత్తం మీద కాపునేతల సమీకరణలు రాష్ట్ర రాజకీయాలను ఎలా మారుస్తాయో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తాజావార్తలు
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..