మళ్లీ మొదటికి పీఆర్సీ పంచాయితీ.. ఇక తేల్చేసేపనిలో ఉద్యోగ సంఘాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మలుపులు తిరిగి ఖరారైన పీఆర్సీ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఫిట్ మెంట్ ఫిక్స్ చేసే సమయంలో సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీ నివేదిక ప్రకారం 14.29 శాతం ఫిట్ మెంట్ మాత్రమే ఇస్తామన్న ప్రభుత్వం.. చివరకు 23 శాతానికి అంగీకరించింది. దీనికి ఉద్యోగ సంఘాలు కూడా సంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే తాజాగా హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం.. అధికారుల కమిటీ సిఫార్సులనే పాటిస్తూ ఆ మేరకు జీవోలు జారీ చేసింది. దీంతో సీఎంవో అధికారులతో హెచ్ఆర్ఏ, సీసీఏ రద్దు అంశాలపై పండుగకు ముందు చర్చలు జరిపిన ఉద్యోగులు.. తాజా జీవోల జారీతో షాక్కు గురయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే.. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో అగ్గిని రాజేసింది.
Read Also: అసెంబ్లీ పోల్.. పంజాబ్లో అనూహ్య పరిణామాలు
Also Read
- AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
- OTR: సాయి కృష్ణ కస్టోడియల్ డె*త్.. హోమ్ మంత్రి ఎందుకు మౌనం?
- OTR: డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎమ్మెల్యే పార్ధసారధి ప్రయత్నాలు.. ఎందుకు రివర్స్ అవుతున్నాయి?
- Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
చరిత్రలో ఇంత వరకు కనివినీ ఎరుగని రీతిలో ఉద్యోగులకు నష్టం చేకూర్చేలా ప్రభుత్వం పీఆర్సీ విషయంలో నిర్ణయం తీసుకుందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. దాదాపు అన్ని సంఘాలు ఏకతాటిపై వచ్చి ప్రభుత్వ జీవోను వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వానికి విధేయుడిగా ఉండే సచివాలయ ఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డి కూడా సర్కార్ తీరును తప్పుబట్టడం చర్చనీయాంశమైంది. కొన్నింట్లో రాజీపడతామని.. కానీ అన్నింట్లో రాజీ పడుతూ పోతే తమను చరిత్ర క్షమించదన్నారాయన. ఇక, ప్రభుత్వం జీవోను ఉపసంహకరించుకోవాలని.. అవసరమైతే సమ్మెకైనా సిద్దమంటూ ప్రకటించారు ఉద్యోగ నేతలు. డీఏలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ స్థాయిలో ఉద్యోగులను నిర్లక్ష్యం చేయడానికి కారణం సంఘాల మధ్య అనైక్యతేననే విషయాన్ని గుర్తించినట్టుగా కన్పిస్తోంది. దీంతో తమ మధ్య ఉన్న విబేధాలను పక్కన పెట్టి.. ఉద్యోగ సంఘాలు ఏకమయ్యే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. పీఆర్సీపై ఉద్యమ కార్యాచరణకు ఉద్యోగ సంఘాలు సిద్ధం అవుతున్నాయి.. ఇవాళ సమావేశం కానున్న ఏపీ ఎన్జీవో సంఘం నేతలు.. పీఆర్సీ, హెచ్ఆర్ఏ, సీసీఏ రద్దు వంటి అంశాల పై ప్రభుత్వం నిర్ణయంపై చర్చించనున్నారు.. మరోవైపు.. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గం వేర్వేరుగా సమావేశం కాబోతోంది.. రేపు సాయంత్రం ఉమ్మడిగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
PoK Protests: “మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!”.. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
-
Tata Sierra EV: 665KM రేంజ్తో టాటా సియెర్రా EV లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
-
Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!