ప్రభుత్వం మొండి గా వ్యవహరిస్తోంది : వెంకట్రామిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చలో విజయవాడ లో భాగంగా సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట రామిరెడ్డి బైక్ పై విజయవాడ బయలుదేరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మొండి గా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. పే స్లిప్ లు చూస్తే గానీ సాలరీ పెరిగిందో తగ్గిందో తెలుసుకోలేని స్థితిలో ఉద్యోగులు లేరని, న్యాయబద్ధమైన హక్కు కోసం సమావేశం పెట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతోందని ఆయన అన్నారు. ఉద్యోగ సంఘాలకు అవసరమైన ఆందోళన చేసిన ఘటనలు చూశాం ..కానీ ఉద్యోగుల నుండి ఈ స్థాయి వ్యతిరేకత మూట కట్టుకుని ప్రభుత్వం ఏం సాధిస్తుంది అని ఆయన మండిపడ్డారు.
పది రోజుల నుండి మొత్తుకున్నా ఫలితం లేదు…అందుకే నిరసన బాట పట్టాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ప్రయత్నించాం కానీ ప్రభుత్వం మమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేసిందని ఆయన తెలిపారు. మాకు న్యాయం చేయాలని మాత్రమే పోరాటం చేస్తున్నామని, నేటి చలో విజయవాడ కార్యక్రమానికి వేల సంఖ్యలో ఉద్యోగులు స్వచందంగా వస్తున్నారని ఆయన అన్నారు. పోలీస్ లను అడ్డుపెట్టుకుని మమ్మల్ని ఆపాలని చూడటం ప్రభుత్వం మమ్మల్ని దూరం చేసుకోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..