Chintamaneni Prabhakar: 20 ఏళ్ల వరకు అధికారంలో కూటమి ప్రభుత్వం..! చింతమనేని ఆసక్తికర వ్యాఖ్యలు
- ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు..
- నియోజకవర్గంలోని ఉద్యోగస్తులకు పిండి వంటలు పంపిణీ..
- అమరావతి నుండి పోలవరం వరకు అభివృద్ధి జరుగుతుంది..
- 20 సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chintamaneni Prabhakar: ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. దెందులూరు నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాబోయే 20 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నియోజకవర్గంలోని ఉద్యోగస్తులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేతుల మీదుగా పిండి వంటలు పంపిణీ చేశారు. కుటుంబ సభ్యులను కోల్పోయి పండుగకు దూరంగా ఉన్నవారిని కుటుంబ సభ్యులుగా భావించి వారికి కూడా పిండి వంటలు అందించినట్లు తెలిపారు.
Read Also: Poco M8 5G: ఇండియాలో స్టార్ట్ అయిన Poco M8 5G సేల్.. ధరలు, ఆఫర్లు ఇవే!
Also Read
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
- Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
ఇక, కొత్త సంవత్సరం సందర్భంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి, ఎవరికి సంబంధించిన బొమ్మలు లేకుండా పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని వెల్లడించారు చింతమనేని.. అలాగే ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చామని, ‘తల్లికి వందనం’ పథకం ద్వారా గతంతో పోలిస్తే ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు. ‘తల్లికి వందనం’ పథకంలో కొంతమంది అధికారులు చేసిన తప్పిదాల వల్ల కొందరు ఇబ్బంది పడ్డారని, వారికి కూడా త్వరలో లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు.
అమరావతి నుంచి పోలవరం వరకు అభివృద్ధి జరుగుతోందని, కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని అన్నారు చింతమనేని.. అయితే, కొంతమంది కావాలనే కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని, సమాజంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ బూటకమని, దెందులూరు నియోజకవర్గంలో ఆ పార్టీకి స్థానం లేదని వ్యాఖ్యానించారు.. కొన్ని పార్టీలకు దెందులూరులో నాయకులే లేరని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తుందని, నియోజకవర్గంలో ఎవరికైనా ఏ సమస్య వచ్చినా, వారు ఏ పార్టీకి చెందినవారైనా తాను సహాయం చేస్తానని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!