Chintamaneni Prabhakar: 20 ఏళ్ల వరకు అధికారంలో కూటమి ప్రభుత్వం..! చింతమనేని ఆసక్తికర వ్యాఖ్యలు
- ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు..
- నియోజకవర్గంలోని ఉద్యోగస్తులకు పిండి వంటలు పంపిణీ..
- అమరావతి నుండి పోలవరం వరకు అభివృద్ధి జరుగుతుంది..
- 20 సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chintamaneni Prabhakar: ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. దెందులూరు నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాబోయే 20 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నియోజకవర్గంలోని ఉద్యోగస్తులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేతుల మీదుగా పిండి వంటలు పంపిణీ చేశారు. కుటుంబ సభ్యులను కోల్పోయి పండుగకు దూరంగా ఉన్నవారిని కుటుంబ సభ్యులుగా భావించి వారికి కూడా పిండి వంటలు అందించినట్లు తెలిపారు.
Read Also: Poco M8 5G: ఇండియాలో స్టార్ట్ అయిన Poco M8 5G సేల్.. ధరలు, ఆఫర్లు ఇవే!
Also Read
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
ఇక, కొత్త సంవత్సరం సందర్భంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి, ఎవరికి సంబంధించిన బొమ్మలు లేకుండా పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని వెల్లడించారు చింతమనేని.. అలాగే ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చామని, ‘తల్లికి వందనం’ పథకం ద్వారా గతంతో పోలిస్తే ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు. ‘తల్లికి వందనం’ పథకంలో కొంతమంది అధికారులు చేసిన తప్పిదాల వల్ల కొందరు ఇబ్బంది పడ్డారని, వారికి కూడా త్వరలో లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు.
అమరావతి నుంచి పోలవరం వరకు అభివృద్ధి జరుగుతోందని, కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని అన్నారు చింతమనేని.. అయితే, కొంతమంది కావాలనే కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని, సమాజంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ బూటకమని, దెందులూరు నియోజకవర్గంలో ఆ పార్టీకి స్థానం లేదని వ్యాఖ్యానించారు.. కొన్ని పార్టీలకు దెందులూరులో నాయకులే లేరని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తుందని, నియోజకవర్గంలో ఎవరికైనా ఏ సమస్య వచ్చినా, వారు ఏ పార్టీకి చెందినవారైనా తాను సహాయం చేస్తానని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్తో నవ్వులే నవ్వులు!
-
FEFSI : కోలీవుడ్లో సమ్మె సైరన్పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
-
Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
-
Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
-
India vs Afghanistan: భారత్తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!