MP Putta Mahesh: వైసీపీ పాలనలో ఒక్క M.O.U జరగలేదు.. కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలకు భరోసా వచ్చింది..
- వైసీపీ పాలనలో పరిశ్రమలకు సంబంధించిన ఒక్క M.O.U జరగలేదు..
- కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు అండగా ఉంటుంది అనే భరోసా వచ్చింది..
- ఇండియాలో సింగల్ విండో విధానంతో పరిశ్రమలు ఏర్పాటు చేసే ఘనత చంద్రబాబుదే..
- ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Putta Mahesh: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పరిశ్రమలకు సంబంధించిన ఒక్క M.O.U జరగలేదు.. కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు అండగా ఉంటుంది అనే భరోసా వచ్చింది అన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్.. వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన. పరిశ్రమల రంగంలో వైసీపీ పాలన పూర్తిగా విఫలమైందని, వారి అధికార కాలంలో ఒక్క పరిశ్రమలకు సంబంధించిన M.O.U కూడా జరగలేదని మండిపడ్డారు. అయితే, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పరిశ్రమల అభివృద్ధిలో ఉన్న పాత్ర అపారమైనది ప్రశంసించారు.. ఇండియాలో పరిశ్రమల ఏర్పాటు కోసం సింగిల్ విండో సిస్టమ్ను తీసుకు వచ్చిన ఘనత పూర్తిగా చంద్రబాబు నాయుడిదే అని ప్రశంసించారు. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం సృష్టించడం, పెట్టుబడులను ఆకర్షించడం ఆయన నాయకత్వంలోనే సాధ్యమైందని తెలిపారు.
Read Also: Akhanda2Thaandavam : అఖండ – 2.. జాజికాయ.. జాజికాయ.. నువ్వే నా ఆవకాయ..!
Also Read
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
- Home Minister Anitha: 'మావిగన్' పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు
- Nimmala Ramanaidu: కేంద్ర జలశక్తి కార్యదర్శికి మంత్రి నిమ్మల కీలక సూచనలు..
ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమల ఏర్పాటు తప్పనిసరి… పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి అన్నారు ఎంపీ పుట్టా మహేష్.. పరిశ్రమలు వస్తేనే ఆదాయం పెరుగుతుంది.. ఉద్యోగాలు వస్తాయి.. రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. ఇక, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ మోడల్ రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలను సృష్టించబోతుందని చెప్పారు. ఏపీలో భవిష్యత్తులో లక్షలాది మంది యువతకు ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని నమ్మి పెట్టుబడిదారులు రాష్ట్రంలోకి రావడం ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ఇతర దేశాల ప్రజలు కూడా మన రాష్ట్రానికి వచ్చి పని చేసే స్థాయి ఏర్పడుతుంది అని పుట్టా మహేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!