Minister Kolusu Parthasarathy: ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిపై మంత్రి సీరియస్.. ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా..?
- పేషెంట్ల పట్ల ఇంత నిర్లక్ష్యం ఏంటి?..
- ఏలూరులో శిశువు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోండి..
- ఏలూరు ఆర్.ఎం.ఓ కు మంత్రి సారథి సీరియస్ వార్నింగ్..
- ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై మంత్రి పార్థసారథి సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kolusu Parthasarathy: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతిచెందిన ఘటనపై రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సీరియస్ అయ్యారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో బిజీబిజీగా ఉన్న మంత్రికి ఏలూరు జీజీహెచ్ లో జరిగిన విషయం తెలిసిన వెంటనే ఘటనపై ఆరాతీశారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భంలో జాగ్రత్తగా ఉండాలని, పేషెంట్లను జాగ్రత్తగా చూసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఏలూరు జీజీహెచ్ సిబ్బంది తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఏలూరు జీజీహెచ్ ఆర్.ఎం.ఓ పై మండిపడ్డారు.
Also Read
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
- Home Minister Anitha: 'మావిగన్' పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు
- Nimmala Ramanaidu: కేంద్ర జలశక్తి కార్యదర్శికి మంత్రి నిమ్మల కీలక సూచనలు..
- CM Chandrababu: నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలం పోలవరం ప్రాజెక్టు.. మీరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..
తాజాగా, నూజివీడు నియోజకవర్గం, ముసునూరు మండలం, గోపవరం గ్రామానికి చెందిన మహిళ నాగలక్ష్మి డెలివరీ నిమిత్తం ఏలూరు జీజీహెచ్ లో చేరారు. నాగలక్ష్మికి డెలివరీ చేయాల్సిన డాక్టర్ అథియా డెలివరీ డేట్ ఇంకా రాలేదనే కారణంతో డెలివరీ ఆలస్యం చేశారని, దీంతో శిశువు మృతిచెందిందని నాగలక్ష్మీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ఏలూరు జీజీహెచ్ ఆర్.ఎం.ఓ కు మంత్రి కొలుసు పార్థసారథి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. శిశువు చనిపోయిన విషయాన్ని నాగలక్ష్మి కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచి, బాధ్యత లేకుండా వెళ్లిపోవడం ఏంటని నిలదీశారు? గతంలోనూ నూజివీడు నియోజకవర్గానికి చెందిన వారి విషయంలోనూ ఏలూరు జీజీహెచ్ సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని మంత్రి మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని, తనకు నివేదిక ఇచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్.ఎం.ఓ ను మంత్రి పార్థసారథి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అయితే ఎవర్నీ సహించేది లేదని తేల్చిచెప్పారు.
తాజావార్తలు
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
-
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..