‘ఆసరా’కు ఈసీ గ్రీన్ సిగ్నల్.. రేపే ప్రారంభించనున్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఆసరా’ రెండో విడత కార్యక్రమం అమలుకు ఎన్నికల కమిషన్ ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది… ఇప్పటికే అమల్లో ఉన్న కార్యక్రమం కావడంతో ఈసీ అంగీకారం తెలిపింది.. దీంతో.. రేపు ఒంగోలులో ఆసరా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.. వైఎస్సార్ ఆసరా పథకం రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభించనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం కింద రుణమాఫీ కార్యక్రమాన్ని అంజయ్య రోడ్డులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం ప్రారంభిస్తారు. అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసు శిక్షణ కళాశాలలోని హెలీప్యాడ్ను సిద్ధం చేస్తున్నారు. రెండో విడత కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 7.97 లక్షల మహిళా సంఘాల్లోని 78.76 లక్షల మంది సభ్యులకు రూ.6,439 కోట్లు అందించనుంది.
ఆసరా కింద ఇచ్చే మొత్తాన్ని సభ్యులు ఎలా వినియోగించుకుంటారనే దానిపై ఎలాంటి షరతులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండేళ్ల తర్వాత సీఎం.. జిల్లాకు రానుండటంతో జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్ధానిక పీవీఆర్ హైస్కూల్ లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున పొదుపు మహిళల కోసం అమలు చేసే పథకాన్ని ఒంగోలులో ప్రారంభించడం అభినందనీయమన్నారు. రేపు ఉదయం 9.55 గంటలకు సీఎం తన నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు ఒంగోలు పీటీసీలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్.. 10.45 గంటలకు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలోని సభా ప్రాంగణానికి బయలుదేరుతారు. 11 గంటలకు పాఠశాలకు చేరుకుని స్టాల్స్ సందర్శన; రాష్ట్ర మంత్రుల ప్రసంగం, ఆసరా లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొంటారు. 12 నుంచి 12.30 గంటల వరకు సీఎం జగన్ ప్రసంగం కొనసాగనుంది.. 12.30కు వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ప్రారంభించనున్నారు. 12.45 గంటలకు పాఠశాల నుంచి బయలుదేరి 1.55 గంటలకు నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్.
Also Read
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
- Tags
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..