Adulterated Milk: రాజమండ్రిలో కల్తీ పాలతో నలుగురు మృతి.. వెలుగులోకి సంచలన విషయాలు!
- రాజమండ్రి: కల్తీ పాల విషాదానికి సంబంధించి వెలుగులోకి సంచలన విషయాలు..
- పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్ కలిసినట్లు అధికారుల దర్యాప్తులో నిర్ధారణ..
- కూలెంట్ గా ఉపయోగించే ఇథిలీన్ గ్లైకాల్ పాలల్లో కలిసనట్లుగా గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adulterated Milk: రాజమండ్రిలో చోటు చేసుకున్న కల్తీ పాలు విషాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నలుగురు మృతి చెందగా, మరో 8 మంది కిడ్నీ సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటనకు కారణమైన పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్ కలిసిందని అధికారుల విచారణలో నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈరోజు ఫోరెనిక్స్ నివేదికలు వస్తే అధికారికంగా నిర్ధారణ అయ్యే ఛాన్స్ ఉంది.
Read Also: Ravi Teja : భర్త మహశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ కు బ్రేక్.. కారణం ఏంటంటే?
Also Read
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురంకు చెందిన గణేష్ అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మీ డెయిరీలో, పాలు కల్తీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. డెయిరీలోని రిఫ్రిజిరేటర్ లో కూలెంట్గా వినియోగించే ఇథిలీన్ గ్లైకాల్ ఈ నెల 15వ తేదీన లీకై, ఒక పాల క్యాన్లో కలిసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అదే రోజు సరఫరా చేసిన పాలు వినియోగించిన కుటుంబాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన నాలుగు కుటుంబాల్లో 12 మంది, అనూరియా సమస్యతో ఆసుపత్రుల్లో చేరారు.
Read Also: AP Cabinet: నేడే ఏపీ కేబినెట్.. పేదలకు ఇళ్ల స్థలాలపై కీలక చర్చ!
కాగా, ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 8 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉండగా, ఒక చిన్నారి మరో ఇద్దరు వృద్ధుల పరిస్థితి విషమంగా ఉంది. కాగా, పాలల్లో కలిసిన ఇథిలీన్ గ్లైకాల్ సాధారణంగా రిఫ్రిజిరేటర్ లలో కూలెంట్గా ఉపయోగిస్తారు. ఇది శరీరంలోకి వెళ్లినప్పుడు తీవ్రమైన విష ప్రభావం చూపి కిడ్నీలను దెబ్బతీస్తుంది. అధిక మోతాదులో తీసుకుంటే మూత్రపిండాల కరబ్ అయి, మెదడు దెబ్బతినడం, ఆకస్మికంగా చనిపోయే ప్రమాదం ఉంటుంది. బాధితుల్లో కనిపించిన లక్షణాలు ఈ రసాయన ప్రభావంతో సరిపోయినట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
ఇక, పాలు, పెరుగు నమూనాలను సేకరించి సెంట్రల్ ఫోరెనిక్స్ సైన్స్ ల్యాబ్ కు, స్టేట్ ఫోరెనిక్స్ సైన్స్ ల్యాబ్ లకు ఇప్పటికే అధికారులు పంపించారు. కాగా, వందలాది మంది రక్త నమూనాలు సేకరించగా, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఈరోజు రానున్నాయి. అధికారిక నివేదికలతో కల్తీ పాల వ్యవహారంపై పూర్తి స్థాయిలో నిర్ధారణ కానుంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!