Pilli Subhash Chandra Bose: ఏజెంట్లు రాకుండా కూటమి నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారు..
- పులివెందుల, ఒంటిమిట్టలో ఫలితాలతో ఎన్నికలపై నమ్మకం పోయింది..
- పోలింగ్ కేంద్రాల్లోకి ఏజెంట్లు రాకుండా కూటమి నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారు..
- ఎన్నికల కమిషన్ తమ విదానాన్ని మార్చుకోవాలి: ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pilli Subhash Chandra Bose: పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలపై అందరికీ నమ్మకం పోయింది.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పై నమ్మకం లేదు.. బీజేపీ మినహా అని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని వెల్లడించారు. పులివెందుల, ఒంటిమెట్టలలో రీ పోలింగ్ జరపాలి.. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ను కోరింది.. కానీ, పోలింగ్ కేంద్రాల్లోకి ఏజెంట్లు కూడా రాకుండా కూటమి నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారు అని ఆరోపించారు. దొంగ ఓట్లకు సంబంధించిన సాక్ష్యాలు ఎన్నికలు కమిషన్ ముందు పెట్టినందున పరిశీలించి రీపోలింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా, ఎన్నికల కమిషన్ తమ విదానాన్ని మార్చుకోవాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
Read Also: HCA: బీసీసీఐ నుంచి హెచ్సీఏకు రూ. 240 కోట్లు.. 20 రోజుల్లో రూ. 200 కోట్లు మాయం..!
Also Read
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
ఇక, ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖాత్ లో భార్య, కుమారుడు, రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రబోస్ కలిశారు. రాజకీయ కక్షలతోనే ఎంపీ మిధున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ఉన్న రాజకీయ వైర్యమే కారణం.. కూటమి ప్రభుత్వంలో వ్యక్తిగత కక్షలతో అరెస్టులు చేయటం ఫ్యాషన్ గా మారింది.. వ్యక్తిగత కక్షలకు పోతే ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించలేదన్నారు. పార్లమెంట్ సభ్యులకు ఇవ్వాల్సిన సౌకర్యాలు జైలు అధికారులు కల్పించడం లేదు.. రాజకీయాల్లో ఉన్నవారు ఏదో ఒక రోజు జైలుకు వెళ్లడం తప్పదని ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.. రాజకీయంగా నైతిక విలువలు పడిపోయాయని ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!