Pilli Subhash Chandra Bose: ఏజెంట్లు రాకుండా కూటమి నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారు..
- పులివెందుల, ఒంటిమిట్టలో ఫలితాలతో ఎన్నికలపై నమ్మకం పోయింది..
- పోలింగ్ కేంద్రాల్లోకి ఏజెంట్లు రాకుండా కూటమి నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారు..
- ఎన్నికల కమిషన్ తమ విదానాన్ని మార్చుకోవాలి: ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pilli Subhash Chandra Bose: పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలపై అందరికీ నమ్మకం పోయింది.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పై నమ్మకం లేదు.. బీజేపీ మినహా అని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని వెల్లడించారు. పులివెందుల, ఒంటిమెట్టలలో రీ పోలింగ్ జరపాలి.. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ను కోరింది.. కానీ, పోలింగ్ కేంద్రాల్లోకి ఏజెంట్లు కూడా రాకుండా కూటమి నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారు అని ఆరోపించారు. దొంగ ఓట్లకు సంబంధించిన సాక్ష్యాలు ఎన్నికలు కమిషన్ ముందు పెట్టినందున పరిశీలించి రీపోలింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా, ఎన్నికల కమిషన్ తమ విదానాన్ని మార్చుకోవాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
Read Also: HCA: బీసీసీఐ నుంచి హెచ్సీఏకు రూ. 240 కోట్లు.. 20 రోజుల్లో రూ. 200 కోట్లు మాయం..!
Also Read
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
ఇక, ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖాత్ లో భార్య, కుమారుడు, రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రబోస్ కలిశారు. రాజకీయ కక్షలతోనే ఎంపీ మిధున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ఉన్న రాజకీయ వైర్యమే కారణం.. కూటమి ప్రభుత్వంలో వ్యక్తిగత కక్షలతో అరెస్టులు చేయటం ఫ్యాషన్ గా మారింది.. వ్యక్తిగత కక్షలకు పోతే ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించలేదన్నారు. పార్లమెంట్ సభ్యులకు ఇవ్వాల్సిన సౌకర్యాలు జైలు అధికారులు కల్పించడం లేదు.. రాజకీయాల్లో ఉన్నవారు ఏదో ఒక రోజు జైలుకు వెళ్లడం తప్పదని ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.. రాజకీయంగా నైతిక విలువలు పడిపోయాయని ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!