Pilli Subhash Chandra Bose: ఏజెంట్లు రాకుండా కూటమి నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారు..
- పులివెందుల, ఒంటిమిట్టలో ఫలితాలతో ఎన్నికలపై నమ్మకం పోయింది..
- పోలింగ్ కేంద్రాల్లోకి ఏజెంట్లు రాకుండా కూటమి నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారు..
- ఎన్నికల కమిషన్ తమ విదానాన్ని మార్చుకోవాలి: ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
Pilli Subhash Chandra Bose: పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలపై అందరికీ నమ్మకం పోయింది.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పై నమ్మకం లేదు.. బీజేపీ మినహా అని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని వెల్లడించారు. పులివెందుల, ఒంటిమెట్టలలో రీ పోలింగ్ జరపాలి.. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ను కోరింది.. కానీ, పోలింగ్ కేంద్రాల్లోకి ఏజెంట్లు కూడా రాకుండా కూటమి నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారు అని ఆరోపించారు. దొంగ ఓట్లకు సంబంధించిన సాక్ష్యాలు ఎన్నికలు కమిషన్ ముందు పెట్టినందున పరిశీలించి రీపోలింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా, ఎన్నికల కమిషన్ తమ విదానాన్ని మార్చుకోవాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
Read Also: HCA: బీసీసీఐ నుంచి హెచ్సీఏకు రూ. 240 కోట్లు.. 20 రోజుల్లో రూ. 200 కోట్లు మాయం..!
Also Read
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
- Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
- Rabi Paddy Procurement: రైతులకు గుడ్న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
ఇక, ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖాత్ లో భార్య, కుమారుడు, రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రబోస్ కలిశారు. రాజకీయ కక్షలతోనే ఎంపీ మిధున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ఉన్న రాజకీయ వైర్యమే కారణం.. కూటమి ప్రభుత్వంలో వ్యక్తిగత కక్షలతో అరెస్టులు చేయటం ఫ్యాషన్ గా మారింది.. వ్యక్తిగత కక్షలకు పోతే ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించలేదన్నారు. పార్లమెంట్ సభ్యులకు ఇవ్వాల్సిన సౌకర్యాలు జైలు అధికారులు కల్పించడం లేదు.. రాజకీయాల్లో ఉన్నవారు ఏదో ఒక రోజు జైలుకు వెళ్లడం తప్పదని ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.. రాజకీయంగా నైతిక విలువలు పడిపోయాయని ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Washington Hilton Gunfire: వైట్ హౌస్ కార్యక్రమంలో కాల్పుల కలకలం.. భయంతో టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.!
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
-
1 Nenokkadine: కల్ట్ క్లాసిక్ ‘1 నేనొక్కడినే’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..
-
SRH vs RR: వైభవ్ సెంచరీ వృథా.. అభిషేక్-కిషన్ జోడీ సునామీ! జైపూర్లో కొనసాగిన SRH జైత్రయాత్ర.!
-
Thalaivar 173: తలైవర్ 173 నుంచి షాకింగ్ న్యూస్.. శంకర్ వర్సెస్ రజనీకాంత్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!