Peddireddy Ramachandra Reddy: ఏపీలో తాలిబాన్ల పాలన నడుస్తోంది.. కూటమి ప్రభుత్వంపై పెద్దిరెడ్డి ఫైర్!
- రాజమండ్రి సెంట్రల్ రిమాండ్లో ఎంపీ మిథున్ రెడ్డితో పెద్దిరెడ్డి ములాఖాత్..
- పెద్దిరెడ్డి రాకతో సెంట్రల్ జైలకు భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలు..
- వైసీపీ నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్నారు.. ఏపీలో తాలిబాన్ల పాలన నడుస్తోంది..
- ప్రజా ప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy Ramachandra Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్ రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రాకతో సెంట్రల్ జైలుకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇక, రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతలను ఎన్డీయే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసుకుని మరి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీలో తాలిబాన్ల పాలన నడుస్తోంది.. ప్రజా ప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదన్నారు.
Read Also: Indian Passport: భారతీయులకు శుభవార్త.. ఇకపై 59 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్!
Also Read
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
- Anantha Babu Case: జైల్లో ఇంటి భోజనం కోరిన అనంతబాబు.. కోర్టు కీలక ఆదేశాలు
- Minister Nimmala Ramanaidu: జగన్ పాలనపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు.. మేనమామనని చెప్పి మోసం చేశారు..!
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
ఇక, టెర్రరిస్టులు మాదిరిగా వైసీపీ నేతలను ట్రీట్ చేస్తున్నారు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.కూటమి ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నాం.. ప్రజా ప్రతినిధులకు ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిబంధన ప్రకారం సౌకర్యాలు కల్పించకపోతే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం మద్యం వినియోగాన్ని అదుపు చేసింది.. బెల్టు షాపులు లేకుండా, మద్యం అధిక ధరలకు విక్రయించి ప్రభుత్వానికి రెవెన్యూ పెంచింది.. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి రూ. 25,700 కోట్లు ఆదాయం వచ్చింది.. 2014-19 మధ్యకాలంలో ప్రభుత్వానికి రూ. 17,000 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు.. డిస్టలరిలకు అనుమతులన్నీ చంద్రబాబే ఇచ్చారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
Read Also: HHVM : హరిహర వీరమల్లుపై నారా లోకేష్ స్పెషల్ ట్వీట్.. మాస్ పవర్
ఎంపీ మిథున్ రెడ్డి మీద బనాయించింది అక్రమ కేసు అని మాజీ మంత్రి తానేటి వనిత అన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపించేది.. మద్యం స్కామ్ పేరుతో ఎంపీ మిథున్ రెడ్డిని జైలు పాలు చేయటం దారుణం అని పేర్కొనింది. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమా అరెస్టులపై పోరాటం చేస్తామని వెల్లడించింది.
తాజావార్తలు
-
Director Teja: డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్.. “బుర్రలేని దర్శకులతో పని చేయడమే నా అదృష్టం!”
-
Noida: నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
-
Axar Patel Record: అక్షర్ పటేల్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ సరసన చోటు!
-
Pawan Kalyan: ముంబై హాస్పిటల్ నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
-
Casting Couch: ‘బట్టలు విప్పమన్నారు’.. కాస్టింగ్ కౌచ్పై నటి శ్వేతా క్వాత్రా షాకింగ్ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!