Deputy CM Pawan: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. డిప్యూటీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
- ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే ఐదుగురు మృతి..
- రోడ్డు ప్రమాదంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్..
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా: పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పుగోదారి జిల్లా రంగంపేట మండలం వడిసలేరులో ట్యాంకర్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉప్పాడ బీచ్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి వెళ్లి.. ప్రమాదాన్ని పరిశీలించారు. ట్యాంకర్ను, కారును పక్కకు తీసి.. ఐదుగురి మృతదేహాలను గవర్నమెంట్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Crime News: ప్రేమను తిరస్కరించిందని 18 సార్లు స్క్రూడ్రైవర్తో దాడి.. చివరకి..?
Also Read
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
- Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్ కొట్టివేసిన కోర్టు..
- Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్
అయితే, ముందు వెళుతున్న వాహనాన్ని లెఫ్ట్ సైడ్ ఓవర్ టెక్ చేసి పక్కకు రావటంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్యాంకర్ ను కారు ఢీకొట్టింది.. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మృతులు రాజానగరం మండలం రఘునాథపురం, రాజమండ్రి రూరల్ కవలగొయ్యికి చెందిన రెండు కుటుంబాల వారిగా పోలీసులు గుర్తించారు. మృతులు రేలంగి శివన్నారాయణ (40), దేవి లలిత (34), రేలింగి వర్షిత (13)తో పాటు తీగిరెడ్డి శివ (30), తీగ రెడ్డి సాన్వి(4)గా గుర్తించారు. అలాగే, తీగి రెడ్డి భవాని (26), రేలంగి హర్షిత (13) గాయపడటంతో వారిని స్థానిక హస్పటల్ కి చికిత్స కోసం తరలించారు.
Read Also: Bank Robbery: బ్యాంక్లో భారీ దొంగతనం.. 59 కిలోల బంగారం చోరీ..!
కాగా, ఈ రోడ్డు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. రాజమండ్రి – కాకినాడ ఏడీబీ రోడ్డుపై వడిశలేరు దగ్గర చోటు చేసుకున్న ప్రమాదంలో ఐదుగురు చనిపోయారని తెలిసి చింతిస్తున్నాను.. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమైంది.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు. ఇక, ఏడీబీ రహదారి పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఇప్పటికే సంబంధిత శాఖలకు, జిల్లా అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయడమైంది.
తాజావార్తలు
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..