Deputy CM Pawan: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. డిప్యూటీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
- ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే ఐదుగురు మృతి..
- రోడ్డు ప్రమాదంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్..
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా: పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పుగోదారి జిల్లా రంగంపేట మండలం వడిసలేరులో ట్యాంకర్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉప్పాడ బీచ్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి వెళ్లి.. ప్రమాదాన్ని పరిశీలించారు. ట్యాంకర్ను, కారును పక్కకు తీసి.. ఐదుగురి మృతదేహాలను గవర్నమెంట్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Crime News: ప్రేమను తిరస్కరించిందని 18 సార్లు స్క్రూడ్రైవర్తో దాడి.. చివరకి..?
Also Read
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
అయితే, ముందు వెళుతున్న వాహనాన్ని లెఫ్ట్ సైడ్ ఓవర్ టెక్ చేసి పక్కకు రావటంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్యాంకర్ ను కారు ఢీకొట్టింది.. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మృతులు రాజానగరం మండలం రఘునాథపురం, రాజమండ్రి రూరల్ కవలగొయ్యికి చెందిన రెండు కుటుంబాల వారిగా పోలీసులు గుర్తించారు. మృతులు రేలంగి శివన్నారాయణ (40), దేవి లలిత (34), రేలింగి వర్షిత (13)తో పాటు తీగిరెడ్డి శివ (30), తీగ రెడ్డి సాన్వి(4)గా గుర్తించారు. అలాగే, తీగి రెడ్డి భవాని (26), రేలంగి హర్షిత (13) గాయపడటంతో వారిని స్థానిక హస్పటల్ కి చికిత్స కోసం తరలించారు.
Read Also: Bank Robbery: బ్యాంక్లో భారీ దొంగతనం.. 59 కిలోల బంగారం చోరీ..!
కాగా, ఈ రోడ్డు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. రాజమండ్రి – కాకినాడ ఏడీబీ రోడ్డుపై వడిశలేరు దగ్గర చోటు చేసుకున్న ప్రమాదంలో ఐదుగురు చనిపోయారని తెలిసి చింతిస్తున్నాను.. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమైంది.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు. ఇక, ఏడీబీ రహదారి పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఇప్పటికే సంబంధిత శాఖలకు, జిల్లా అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయడమైంది.
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!