Deputy CM Pawan: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. డిప్యూటీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
- ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే ఐదుగురు మృతి..
- రోడ్డు ప్రమాదంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్..
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా: పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పుగోదారి జిల్లా రంగంపేట మండలం వడిసలేరులో ట్యాంకర్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉప్పాడ బీచ్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి వెళ్లి.. ప్రమాదాన్ని పరిశీలించారు. ట్యాంకర్ను, కారును పక్కకు తీసి.. ఐదుగురి మృతదేహాలను గవర్నమెంట్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Crime News: ప్రేమను తిరస్కరించిందని 18 సార్లు స్క్రూడ్రైవర్తో దాడి.. చివరకి..?
Also Read
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Jakkampudi Raja Protest: పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన జక్కంపూడి..
అయితే, ముందు వెళుతున్న వాహనాన్ని లెఫ్ట్ సైడ్ ఓవర్ టెక్ చేసి పక్కకు రావటంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్యాంకర్ ను కారు ఢీకొట్టింది.. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మృతులు రాజానగరం మండలం రఘునాథపురం, రాజమండ్రి రూరల్ కవలగొయ్యికి చెందిన రెండు కుటుంబాల వారిగా పోలీసులు గుర్తించారు. మృతులు రేలంగి శివన్నారాయణ (40), దేవి లలిత (34), రేలింగి వర్షిత (13)తో పాటు తీగిరెడ్డి శివ (30), తీగ రెడ్డి సాన్వి(4)గా గుర్తించారు. అలాగే, తీగి రెడ్డి భవాని (26), రేలంగి హర్షిత (13) గాయపడటంతో వారిని స్థానిక హస్పటల్ కి చికిత్స కోసం తరలించారు.
Read Also: Bank Robbery: బ్యాంక్లో భారీ దొంగతనం.. 59 కిలోల బంగారం చోరీ..!
కాగా, ఈ రోడ్డు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. రాజమండ్రి – కాకినాడ ఏడీబీ రోడ్డుపై వడిశలేరు దగ్గర చోటు చేసుకున్న ప్రమాదంలో ఐదుగురు చనిపోయారని తెలిసి చింతిస్తున్నాను.. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమైంది.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు. ఇక, ఏడీబీ రహదారి పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఇప్పటికే సంబంధిత శాఖలకు, జిల్లా అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయడమైంది.
తాజావార్తలు
-
Producer Deepti: హీరోయిన్పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?