Site icon NTV Telugu

Adulterated Milk: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్

Rjy

Rjy

Adulterated Milk: తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కల్తీ పాలు సేవించి అనారోగ్యం పాలైన వారికి వైద్య పరీక్షల్లో రక్తంలో యూరియా, సీరమ్ క్రియాటినిన్ స్థాయిలు పెరిగినట్లు గుర్తించారు. ఇవి విషపూరిత పదార్థాల ప్రభావంతో సంభవించడంతోనే మూత్రపిండల వైఫల్యాన్ని సూచించినట్లు పేర్కొన్నారు. ప్రాథమిక ఎపిడెమియాలజికల్ పరిశీలనలో, ఈ ఘటనకు పాలు సేవించడం ప్రధాన కారణంగా ఉండవచ్చని అన్నారు.

Read Also: Niharika: ‘రాకాస’తో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం.. థియేటర్‌కు వచ్చిన వాళ్లని నిరాశపర్చం

ఈ పాలను కోరుకొండ మండలంలోని నరసాపురం గ్రామంలో ఉన్న వర లక్ష్మీ మిల్క్ డెయిరీ నుంచి సేకరించి 106 కుటుంబాలకు సరఫరా చేసినట్లు గుర్తించాం.. సంబంధిత డెయిరీ నుంచి పాలు సరఫరాను తక్షణమే నిలిపి వేసినట్లు వెల్లడించారు. అనుమానాస్పద కల్తీ పాలు సేవించడమే ఈ ఘటనకు ప్రధానంగా తెలిపారు. 15 మంది బాధితులు లాలాచెరువు ప్రాంతంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందినవారు.. వీరిలో 11 మంది వెంటిలేటర్ లపై డయాలసిస్ చికిత్స పొందుతున్నట్లు హెల్త్ బులిటెన్ లో వెల్లడించారు.

Exit mobile version