Tirumala : తిరుమల కు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుంది అంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదిరా తిరుపతిలో భక్తుల రద్దీ బాగా ఉంది. ఎందుకంటే వేసవి సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు తిరుమలకు భారీగా చేరుకుంటున్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా టీటీడీ అధికారులు మరియు సిబ్బంది అన్ని రకాల చర్యలను తీసుకుంటూ ఉన్నారు. సోమవారం శ్రీవారి భక్తులతో తిరుమల ఎంతో రద్దీగా ఉంది. మే 29వ తేదీ సోమవారం అర్ధరాత్రి వరకు 78 వేల మంది పై గా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.దాదాపు 37,600 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పించుకొని వారి మొక్కులు తీర్చుకున్నారు.
సోమవారం శ్రీవారికి మూడు కోట్ల 74 లక్షల హుండీ కానుకల రూపంలో వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్ది ఎక్కువ కావడంతో క్యూ కాంప్లెక్స్ నిండిపోయి క్యూ లైన్లు తిరుమల లోని టీబీసీ కాటేజ్ వరకు అయితే వచ్చాయి. ప్రత్యేక దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు వారికి కేటాయించిన సమయంలోనే స్వామివారి దర్శనం కలుగుతుందని సమాచారం.సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు వెల్లడించారు. అలాగే క్యూ లైన్ లో ఉన్న భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి ఓపికగా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దర్శనం అవుతుందని అంతవరకు సహనంతో ఉండాలని టిటిడి అధికారులు విజ్ఞప్తి చేశారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి కాంప్లెక్స్ లో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు అలాగే తాగునీరు అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు. వేసవి సెలవులు పూర్తికావస్తున్న సమయంలో విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వేల సంఖ్యల్లో తిరుమల చేరుకుంటున్నారు.వేసవి సెలవులు పూర్తీ అయ్యేవరకు తిరుమలలో భక్తుల రద్దు బాగా ఎక్కువగా ఉంటుందని టిటిడి అధికారులు చెబుతున్నారు. జూన్ నెలలో తిరుమల లో విశేషా ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరు అవుతారని టీటీడీ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు.
Also Read
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
తాజావార్తలు
-
Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
-
Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
-
SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
-
Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!