Pawan Kalyan: దేశంలో ఓ అరుదైన ఘట్టం అమరావతిలో చోటుచేసుకుంది!
- బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన
- అమరావతి ఆర్థిక పురోగతికి పునాది పడిన రోజు
- ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో ఇదొక బృహత్తర కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి ఆర్థిక పురోగతికి పునాది పడిన రోజు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో ఇదొక బృహత్తర కార్యక్రమం అని పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతి కోసం ప్రతి అడుగు అభివృద్ధికి ప్రధాని మోడీ అందిస్తున్న సహాయ సహకారాలు మర్చిపోలేనిదన్నారు. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సహాయం కాగితాల్లో కరిగిపోకుండా.. జవాబుదారితనం, మంచి సారథ్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. అమరావతి ఆర్థిక కేంద్రంగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరండిప్యూటీ సీఎం పవన్ మాట్లాడారు.
‘రాష్ట్ర భవిష్యత్ కోసం, రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములు కేటాయించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని మోడీ అనేక సహాయ సహకారాలు అందించారు. దేశంలో ఓ అరుదైన ఘట్టం రాజధాని అమరావతిలో చోటుచేసుకుంది. ఎక్కడా లేని విధంగా 13 వందల కోట్ల పెట్టుబడితో 6500 ఉద్యోగాల కల్పనతో రికార్డ్ సృష్టించింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. విశాఖ స్టీల్ ప్లాంటు కోసం 11 వేల కోట్ల రూపాయలు విడుదల చేయటం, అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేళ కోట్లు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు. అమరావతి రైతులు ఎక్కడ ఆందోళన చెందొద్దు.. మీకోసం మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాము’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు.
Also Read
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
- Ramprasad Reddy: ఇకపై ఆటోమేటిక్ ఆమోదం.. 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్.. ఆ వాహనాలకు మినహాయింపు!
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
- Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
Also Read: Pinnelli Brothers: పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో షాక్!
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ’… ‘నిర్మలా సీతారామన్ మహిళలకే కాదు నాలాంటి వారికి ఓ స్ఫూర్తి. ఓ మహిళ నేత 8 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత నిర్మలా గారికి దక్కింది. జీఎస్టీ సంస్కరణలు చేసి పేదవాడి మనసు దోచుకున్న వ్యక్తి నిర్మలా సీతారామన్. ప్రపంచంలో ల్యాండ్ పూలింగ్ చేసిన దేశాలు 4 మాత్రమే, అది కూడా కేవలం 2000 వేల ఎకరాలు. కానీ అమరావతిలో మాత్రం రికార్డు స్థాయిలో 33 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ జరిగింది. అత్యంత ఆధునిక ప్రణాళిక బద్ద రాజధానిగా అమరావతి రూపాంతరం చెందబోతోంది’ అని అన్నారు.
తాజావార్తలు
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
-
K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
-
Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ‘మాపై చేయి వేస్తే.. అణు విలయమే!’
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
-
AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!