CPI 24th congress: మరోసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాజా.. తెలుగు రాష్ట్రాల నుంచి వీరికే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో ఐదు రోజుల పాటు జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 24వ జాతీయ మహాసభలు ముగిశాయి… చివరి రోజైన ఇవాళ నూతన జాతీయ సమితిని ప్రతినిధులు ఎన్నుకున్నారు. ఆ తర్వాత నూతన జాతీయ సమితి డి.రాజాను ఏకగ్రీవంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికుంది… దీంతో.. రెండోసారి ఏకగ్రీవం రాజా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.. కాగా, 2018లో కేరళలోని కొల్లాంలో జరిగిన 23వ జాతీయ మహాసభలో సురవరం సుధాకర్రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికకాగా.. ఆయన 2019 జులైలో అనారోగ్య కారణాలతో తప్పుకోవడంతో డి.రాజాను ఢిల్లీలో జరిగిన జాతీయ సమితి మొదటిసారిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికుంది. ఇప్పుడు రెండసారి 24వ జాతీయ మహాసభలో ఆయనను తిరిగి ఎన్నుకున్నారు ప్రతినిధులు..
ఇక, తెలుగు రాష్ట్రాల నుండి డాక్టర్ కె.నారాయణ రెండోసారి జాతీయ కార్యదర్శివర్గానికి ఎన్నికకాగా.. తెలంగాణకు చెందిన అజీజ్ పాషా మొదటిసారిగా కార్యదర్శివర్గానికి ఎన్నికయ్యారు. మహాసభ 125 మంది జాతీయ సమితి సభ్యులను , 31 మంది (ఒకస్థానం ఖాళీ) కార్యవర్గ సభ్యులను, 11 మంది కార్యదర్శులను ఎన్నుకుంది. కార్యదర్శివర్గంలోకి అనీ రాజా, గిరీశ్ శర్మలను ఆహ్వానితులుగా తీసుకుంది సీపీఐ.. కార్యదర్శివర్గంలో ముగ్గురు కొత్తవారు అడుగుపెట్టారు.. జాతీయ కార్యదర్శివర్గ సభ్యులుగా డి.రాజా, కానం రాజేంద్రన్, అతుల్ కుమార్ అంజాన్, అమర్జీత్ కౌర్, డాక్టర్ కె. నారాయణ, డాక్టర్ బి.కె. కాంగో, బినోయ్ విశ్వం, పల్లభ్ సేన్ గుప్తా, నాగేంద్రనాథ్, సయ్యద్ అజీజ్ పాషా, రామకృష్ణ పాండాలు ఎన్నికయ్యారు. వీరిలో సయ్యద్ అజీజ్ పాషా, నాగేంద్రనాథ్ ఓరా, రామకృష్ణ పాండాలు తొలిసారిగా కార్యదర్శి వర్గానికి ఎన్నికైనవారు కాడం విశేషం..
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
జాతీయ కార్యవర్గంలో తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ కార్యవర్గానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇక, ఆంధ్రప్రదేశ్ నుండి కార్యవర్గానికి కె.రామకృష్ణ, అక్కినేని వనజ ఎన్నికయ్యారు. తెలంగాణ నుండి జాతీయ సమితి సభ్యులుగా చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్ రెడ్డి, పశ్య పద్మ, తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు, కలవేన శంకర్, బాలనర్సింహా, బాగం హేమంతరావు, ఇ.టి.నర్సింహా, ఎన్.బాలమల్లేశ్ (ఆహ్వానితులు)గా ఎన్నికయ్యారు. కంట్రోల్ కమిషన్లో తెలంగాణ నుండి ఏఐటీయూసీ నాయకులు మహ్మద్ యూసుఫ్ సభ్యులుగా మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఇక, 24వ జాతీయ మహాసభలు పెద్ద ఎత్తున విజయవంతం అయ్యాయని వ్యాఖ్యానించారు డి. రాజా.. దేశ ఆర్థిక విధానాలు అగమ్య గోచరంగా వున్నాయి. దేశంలో మోడీ పాలన పూర్తిగా విఫలం అయ్యింది.. మోడీ పాలన ప్రజా వ్యతిరేక పాలన.. 2024లో బీజేపీని ఓడించాలి, అందుకు శాయశక్తుల కృషి చేస్తాం అని ప్రకటించారు.. ఆర్ఎస్ఎస్ దేశంలో మతోన్మదాన్ని సృష్టిస్తుందన్న ఆయన.. నరేంద్ర మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు లొంగిపోయింది.. ఇది కార్పొరేట్ ప్రభుత్వం.. రూపాయి విలువ తగ్గిపోయింది, నిరుద్యోగం పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి.. దేశంలో రాజ్యాంగానికి విలువ లేకుండా పోయింది.. మోడీది ఒక ఫాసిస్ట్ క్యారెక్టర్.. అన్ని సెక్యులర్ పార్టీలు కలిసి రండి… బీజేపీని ఓడిద్దాం అంటూ పిలుపునిచ్చారు డి. రాజా.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!