Cyclone Montha Effect: రైతులను నిండా ముంచిన మొంథా తుఫాన్.. లక్ష ఎకరాల్లో వరి పంట నష్టం
- ఏపీ రైతులకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చిన మొంథా తుఫాన్..
- చెరువుల్లా మారిన పొలాలు.. గాలివానకు దెబ్బతిన్న అరటి, బొప్పాయి, వరి..
- కోనసీమ, ప.గో, తూ.గో జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాల్లో నష్టపోయిన వరి పంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Montha Effect: మొంథా తుఫాన్ రైతులను నిండా ముంచేసింది. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాల్లో వరి పంట దెబ్బతినింది. అనపర్తి, రామచంద్రపురం, నిడదవోలు ప్రాంతాల్లో మరో రెండు వారాల్లో రైతుల చేతికి అందాల్సిన పంట మొత్తం నీట మునిగిపోవడంతో లబోదిబోమంటున్నారు.
Read Also: Abhishek Bachchan: అవార్డులు కొనుక్కుంటాడంటూ ట్రోల్స్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన అభిషేక్ బచ్చన్
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
- AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
- Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
అయితే, మొంథా తుఫానుతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వరి రైతులు నష్టపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని పెదపాడు, నిడమర్రు, దెందులూరు మండలాల్లో వేల ఎకరాల్లో వరి పంట నేలకు ఒరిగింది. ఎకరానికి 30 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
Read Also: Husnabad : కలెక్టర్ కాళ్లపై పడి ఏడ్చిన మహిళా రైతు.. నీళ్లలో కొట్టుకుపోయిన ధాన్యం
అలాగే, తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని సాయి ప్రియాంక కాలనీ మొత్తం జలమయం అయింది. దేవీపట్నంలోని పునరావాస కాలనీ పూర్తిగా మునిగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, గోకవరం- వీర్లంకపల్లి మధ్యలో పెద్ద కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో శ్రీరంగపట్నం గ్రామానికి ప్రమాదం పొంచి ఉంది.
Read Also: RTC Bus Stuck: వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
ఇక, తుఫాను ప్రభావంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడలరేవు మత్స్యకార కుటుంబాలు పునరావాస కేంద్రాలకు చేరుకుంటున్నాయి. ఇంకా మత్స్యకార కుటుంబాలు బురద నీళ్లలోనే రాకపోకలు కొనసాగిస్తున్నాయి. తుఫాన్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తానన్న 3 వేల రూపాయల నగదు, 50 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువుల కోసం వేచి చూస్తున్నారు. ఓడలరేవు నుంచి కోట్లాది రూపాయల చమురు ఉత్పత్తులు రవాణా చేస్తున్న ఓఎన్జీసీ తమ ప్రాంత సమస్యలను పట్టించుకోవడం లేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
తాజావార్తలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!