Cyclone Montha Effect: రైతులను నిండా ముంచిన మొంథా తుఫాన్.. లక్ష ఎకరాల్లో వరి పంట నష్టం
- ఏపీ రైతులకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చిన మొంథా తుఫాన్..
- చెరువుల్లా మారిన పొలాలు.. గాలివానకు దెబ్బతిన్న అరటి, బొప్పాయి, వరి..
- కోనసీమ, ప.గో, తూ.గో జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాల్లో నష్టపోయిన వరి పంట
Cyclone Montha Effect: మొంథా తుఫాన్ రైతులను నిండా ముంచేసింది. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాల్లో వరి పంట దెబ్బతినింది. అనపర్తి, రామచంద్రపురం, నిడదవోలు ప్రాంతాల్లో మరో రెండు వారాల్లో రైతుల చేతికి అందాల్సిన పంట మొత్తం నీట మునిగిపోవడంతో లబోదిబోమంటున్నారు.
Read Also: Abhishek Bachchan: అవార్డులు కొనుక్కుంటాడంటూ ట్రోల్స్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన అభిషేక్ బచ్చన్
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
- Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
- Off The Record : రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీకి తలనొప్పిగా మారుతున్నారా?
- E Challan: ట్రాఫిక్ ఈ చలాన్లపై.. కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..
అయితే, మొంథా తుఫానుతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వరి రైతులు నష్టపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని పెదపాడు, నిడమర్రు, దెందులూరు మండలాల్లో వేల ఎకరాల్లో వరి పంట నేలకు ఒరిగింది. ఎకరానికి 30 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
Read Also: Husnabad : కలెక్టర్ కాళ్లపై పడి ఏడ్చిన మహిళా రైతు.. నీళ్లలో కొట్టుకుపోయిన ధాన్యం
అలాగే, తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని సాయి ప్రియాంక కాలనీ మొత్తం జలమయం అయింది. దేవీపట్నంలోని పునరావాస కాలనీ పూర్తిగా మునిగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, గోకవరం- వీర్లంకపల్లి మధ్యలో పెద్ద కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో శ్రీరంగపట్నం గ్రామానికి ప్రమాదం పొంచి ఉంది.
Read Also: RTC Bus Stuck: వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
ఇక, తుఫాను ప్రభావంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడలరేవు మత్స్యకార కుటుంబాలు పునరావాస కేంద్రాలకు చేరుకుంటున్నాయి. ఇంకా మత్స్యకార కుటుంబాలు బురద నీళ్లలోనే రాకపోకలు కొనసాగిస్తున్నాయి. తుఫాన్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తానన్న 3 వేల రూపాయల నగదు, 50 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువుల కోసం వేచి చూస్తున్నారు. ఓడలరేవు నుంచి కోట్లాది రూపాయల చమురు ఉత్పత్తులు రవాణా చేస్తున్న ఓఎన్జీసీ తమ ప్రాంత సమస్యలను పట్టించుకోవడం లేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
-
Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
-
Katte Pongali Recipe: గుడిలో పెట్టే ప్రసాదం లాంటి కట్టె పొంగలి.. ఈ చిన్న చిట్కాతో ఇంట్లోనే అమృతంలా!
-
Off The Record : రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీకి తలనొప్పిగా మారుతున్నారా?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!