NTV Telugu Site icon

ప‌.గో. జిల్లా అల్ల‌వ‌రంలో 31 వ‌ర‌కు క‌ర్ఫ్యూ..

Curfew

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌చ్చినా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ సంఖ్య‌లో కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. పశ్చిమగోదావరి జిల్లా అల్లవరంలోనూ కోవిడ్ ఉధృతి కొన‌సాగుతూనే ఉంది.. దీంతో.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. ఈ నెల 31 తేదీ వ‌ర‌కు కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ స‌ర్కార్.. అల్ల‌వ‌రంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు, వ్యాపార సముదాయాలు ప‌నియేనుండ‌గా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉద‌యం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండ‌నున్నాయి.. ఇక‌, ఆంక్షలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు త‌ప్ప‌వాని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.. మ‌రోవైపు.. ఏపీ వ్యాప్తంగా నైట్‌ కర్ఫ్యూను ఈ నెల 26 వరకు పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి విదిత‌మే.