ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వచ్చినా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. పశ్చిమగోదావరి జిల్లా అల్లవరంలోనూ కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది.. దీంతో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 31 తేదీ వరకు కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.. అల్లవరంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు, వ్యాపార సముదాయాలు పనియేనుండగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.. ఇక, ఆంక్షలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవాని అధికారులు హెచ్చరిస్తున్నారు.. మరోవైపు.. ఏపీ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను ఈ నెల 26 వరకు పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే.
ప.గో. జిల్లా అల్లవరంలో 31 వరకు కర్ఫ్యూ..
Curfew