CPI Mahasabhalu: అక్టోబర్ 14 నుంచి 18 వరకూ సీపీఐ జాతీయ మహాసభలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు విజయవాడలో సీపీఐ జాతీయ మహా సభలు నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. జాతీయ మహాసభల పోస్టరును ఆవిష్కరించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సభల వివరాలు వెల్లడించారు. సీపీఐ జాతీయ మహా సభలు నాలుగేళ్ల తరువాత జరుగుతున్నాయన్నారు. 24వ జాతీయ మహా సభలు విజయవాడలో ఘనంగా జరుపుకుంటున్నాం. 1961, 1975లో గతంలో విజయవాడ జాతీయ సమావేశాలు జరిగాయి. 47 ఏళ్ల తరువాత మళ్లీ ఇక్కడ సభలు నిర్వహిస్తున్నాం. అక్టోబర్ 14న భారీ ర్యాలీ, సభలో డి.రాజా ఇతర నాయకులు పాల్గొంటారు.
18వ తేదీ వరకు జరిగే సభల్లో అన్ని రాష్ట్రాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు వస్తున్నారు. ఇతర దేశాల్లో ఉన్న కమ్యూనిస్టు నాయకులు హాజరవుతారు. సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, ఇతర వామపక్ష నాయకులు సౌభాగ్య సందేశం ఇస్తారు. నరేంద్ర మోడీ పాలనలో దేశం అన్ని విధాలా నష్టపోయింది. ప్రజాస్వామ్యానికి పాతర వేసి ఏక వ్యక్తి పాలన సాగిస్తున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తే అన్యాయంగా జైళ్లల్లో పెడుతున్నారు.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
ఇళ్లకు సీబీఐ, ఐటీ వాళ్లని పంపి బెదిరిస్తున్నారు. సోనియా గాంధీని కుడా విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారు. ఎనిమిదేళ్ళ పాలనలో దేశాన్ని అప్పుల పాలు చేశారు. బ్లాక్ మనీ తేలేదు, ఉద్యోగాలు లేవు….47 లక్షల కోట్లు అప్పు ఉంటే.. రూ. 155 లక్షల కోట్లకు చేర్చారు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేటు పరం చేశారు. ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పాలని ఏకైక ప్రధాన మంత్రి నరేంద్ర మోడి రికార్డు సృష్టించారు. పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలు పెరిగి పోతున్నాయి. కార్పొరేట్ శక్తులకు మోడీ ఊడిగం చేస్తున్నారు. మళ్లీ మోడీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాజ్యాంగం కూడా మూలన పడేయడం ఖాయం. ఈ అంశాలపై మా జాతీయ సభలలో చర్చిస్తాం అని చెప్పారు సీపీఐ నేతలు.
Harish Rao Letter To Union Minister: కొవిడ్ టీకాల సరఫరా పెంచండి.. కేంద్ర ఆరోగ్య శాఖకు మంత్రి లేఖ..
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!