CPI Mahasabhalu: అక్టోబర్ 14 నుంచి 18 వరకూ సీపీఐ జాతీయ మహాసభలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు విజయవాడలో సీపీఐ జాతీయ మహా సభలు నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. జాతీయ మహాసభల పోస్టరును ఆవిష్కరించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సభల వివరాలు వెల్లడించారు. సీపీఐ జాతీయ మహా సభలు నాలుగేళ్ల తరువాత జరుగుతున్నాయన్నారు. 24వ జాతీయ మహా సభలు విజయవాడలో ఘనంగా జరుపుకుంటున్నాం. 1961, 1975లో గతంలో విజయవాడ జాతీయ సమావేశాలు జరిగాయి. 47 ఏళ్ల తరువాత మళ్లీ ఇక్కడ సభలు నిర్వహిస్తున్నాం. అక్టోబర్ 14న భారీ ర్యాలీ, సభలో డి.రాజా ఇతర నాయకులు పాల్గొంటారు.
18వ తేదీ వరకు జరిగే సభల్లో అన్ని రాష్ట్రాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు వస్తున్నారు. ఇతర దేశాల్లో ఉన్న కమ్యూనిస్టు నాయకులు హాజరవుతారు. సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, ఇతర వామపక్ష నాయకులు సౌభాగ్య సందేశం ఇస్తారు. నరేంద్ర మోడీ పాలనలో దేశం అన్ని విధాలా నష్టపోయింది. ప్రజాస్వామ్యానికి పాతర వేసి ఏక వ్యక్తి పాలన సాగిస్తున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తే అన్యాయంగా జైళ్లల్లో పెడుతున్నారు.
Also Read
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
ఇళ్లకు సీబీఐ, ఐటీ వాళ్లని పంపి బెదిరిస్తున్నారు. సోనియా గాంధీని కుడా విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారు. ఎనిమిదేళ్ళ పాలనలో దేశాన్ని అప్పుల పాలు చేశారు. బ్లాక్ మనీ తేలేదు, ఉద్యోగాలు లేవు….47 లక్షల కోట్లు అప్పు ఉంటే.. రూ. 155 లక్షల కోట్లకు చేర్చారు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేటు పరం చేశారు. ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పాలని ఏకైక ప్రధాన మంత్రి నరేంద్ర మోడి రికార్డు సృష్టించారు. పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలు పెరిగి పోతున్నాయి. కార్పొరేట్ శక్తులకు మోడీ ఊడిగం చేస్తున్నారు. మళ్లీ మోడీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాజ్యాంగం కూడా మూలన పడేయడం ఖాయం. ఈ అంశాలపై మా జాతీయ సభలలో చర్చిస్తాం అని చెప్పారు సీపీఐ నేతలు.
Harish Rao Letter To Union Minister: కొవిడ్ టీకాల సరఫరా పెంచండి.. కేంద్ర ఆరోగ్య శాఖకు మంత్రి లేఖ..
తాజావార్తలు
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
ట్రెండింగ్
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!