రుషికొండలో నారాయణ పర్యటన.. ప్రకృతిని నాశనం చేసిన పాపం ఊరికే పోదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద రుషికొండ నిర్మాణాలపై ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. టూరిజం ప్రాజెక్ట్ కోసం ఖరీదైన విల్లాలు తప్ప ప్రచారంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి నివాస భవనాల స్థాయిలో ఎటువంటి నిర్మాణాలు జరగడం లేదన్నారు. అయితే, పర్యావరణంకు జరుగుతున్న హాని మాత్రం క్షమించరానిది అన్న నారాయణ.. మంత్రులు, సలహాదారులపైన ఫైర్ అయ్యారు. అతి రహస్యం బట్టబయలు అన్నట్టుగా కోర్టు ఆదేశాలతో వస్తే తప్ప నిజాలు ప్రజలకు తెలియకుండా చూడడం సరైన విధానం కాదన్నారు.. ఆగస్టులో రుషి కొండ సందర్శన కోసం హైకోర్టును ఆశ్రయించాను.. మూడు నెలల పాటు నాకు అవకాశం ఇవ్వలేదని.. మళ్లీ కోర్టుకు వెళ్లడంతో ఈ రోజు చూడటానికి అనుమతిచ్చారన్నారు.. నేను చూసి వచ్చాను, ఇక్కడ సీఎం కార్యాలయం లాంటిది కట్టడం లేదన్న ఆయన.. కానీ విలాసవంతమైన భవనాలు కడుతున్నారు. ఈ ప్రభుత్వ పెద్దలు పర్యావరణాన్ని హత్యాచారం చేసింది.. విల్లాలను ఎక్కడైనా కట్టుకోవచ్చు, అనకాపల్లిలో ఇతర చోట కట్టవచ్చు.. కానీ, ప్రకృతిని నాశనం చేసిన పాపం మాత్రం ఊరికే పోదని హెచ్చరించారు.
Read Also: Road Accidents: ఏపీలో భారీగా పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. 10 నెలల్లో 5,831 మంది మృతి
Also Read
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
కట్టడం చట్ట ప్రకారమే.. కానీ, కొండను తొలిచేయడం నేరం అన్నారు నారాయణ.. ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలలో అధికారులు కూడా రాత్రి బస చేసే అనుమతి లేదన్న ఆయన.. కేవలం పర్యాటకులు ఉండడానికి విల్లాలు మాత్రమే నిర్మిస్తున్నారు.. మిడి మిడి జ్ఞానంతో ఉన్న మంత్రులు మాట్లాడటం వల్ల ఇది ఇంతవరకు వచ్చిందని మండిపడ్డారు.. రుషికొండ వెళ్ళేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన మూడు నెలలకు కానీ ప్రభుత్వం అంగీకరించ లేదు.. నేను ఏమైనా పేలుడు పదార్ధాలు తీసుకుని వెళుతున్నానా..? ఉగ్రవాదినా..!? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఋషికొండలో నిర్మాణ ప్రణాళికలు చూసినప్పుడు రెండు మూడు రకాల రిసార్ట్స్, భవనాలు తప్ప ఎటువంటి ఇతర కట్టడాలు కనిపించడం లేదన్నారు.. ముఖ్యమంత్రి ఇంటి కోసం నిర్మాణంగా జరుగుతున్నది ప్రచారంగానే కనిపించింది.. సీఎం నివాసం వుండే భవంతి లాంటి నిర్మాణాలు ఏవీ ఋషికొండలో కనిపించ లేదన్నారు. కానీ, రుషికొండ ఒరిజినాలిటీ దెబ్బ తీస్తున్నారు.. విశాఖలో చాలా భూములు ఉండగా సహజసిద్ధమైన ప్రకృతిని ఎందుకు దెబ్బతీయాలి.. ఇక్కడ ప్రకృతిపై అఘాయిత్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అయితే, నారాయణతో పాటు మరికొందరు సీపీఐ నేతు రుషికొండ వెళ్లేందుకు ప్రయత్నించగా.. అడ్డుకున్నారు పోలీసులు.. ఆయన కోసం ఓ వాహనాన్ని ఏర్పాటు చేసి.. పంపించారు.. దీంతో, పోలీసులు, సీపీఐ నేతలు, కార్యకర్తల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకోవడంతో.. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..