సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏ విషయం మీదనైనా చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు. తనదైన రీతిలో స్పందిస్తూ వుంటారు. ఆయన రూటే సపరేటు. అంతా వివిధ సమస్య గురించి మాట్లాడితే.. మొన్నామధ్య బిగ్ బాస్ గురించి విమర్శలు చేశారు. తిరుపతిలో నారాయణ ఏపీ రాజకీయాలపై స్పందించారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చును అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు స్వాగతిస్తున్నా అన్నారు. బీజేపీ ఎలా వైసీపీకి వ్యతిరేకంగా రోడ్ మ్యాప్ ఇస్తుంది. వైసీపీ, బీజేపీలు లివింగ్ టు గెథర్ లో ఉన్నాయన్నారు.
వారి సహజీవనం మధ్యలో పవన్ కల్యాణ్ కు రోడ్డు మ్యాప్ ఎలా ఇస్తారో అర్థం కావడం లేదన్నారు. వైసీపీ నాయకులు ఢిల్లీలో భరతనాట్యం చేస్తూ ఏపీకి వచ్చి శివతాండవమాడుతున్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక ఓటు చీల్చకుండా చూడటం ముఖ్యం. బీజేపీ విషయంలో వైసీపీ, టీడీపీ, జనసేనలు మాటెత్తకపోవడం బాధాకరం అన్నారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీల బలం బాగా తగ్గిపోయిందని ఒప్పుకున్నారు నారాయణ. మేము బలంగా ఉన్నప్పుడు అన్ని పార్టీలు మా దగ్గరకు వచ్చినవే. ఇప్పుడు బలం తగ్గడంతో ఆ పరిస్థితి లేదన్నారు నారాయణ.
పవన్ కళ్యాణ్ త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. జనసేనానిలో రాజకీయ స్పష్టత లేదు. ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వైసీపీని వ్యతిరేకించే వారితో పొత్తులుంటుందని చెప్పారు..?కబ్జాల నుంచి, దౌర్జన్యాల నుంచి, అరాచకాల నుంచి బయటకు రావాలని సిఎం ఎమ్మెల్యేలకు సూచించారు. వైసీపీ అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో జగన్ మాటలతోనే అర్థమవుతోందన్నారు నారాయణ. మూడేళ్ళు రాష్ట్రాన్ని దోచేశామని సీఎం చెప్పకనే చెప్పారు..! మాతో ఏ పార్టీ పొత్తులు పెట్టుకునే అవకాశం లేదన్నారు నారాయణ.