ఏపీలో కరోనా ఉధృతి మళ్లీ మొదలైందా..? అదే కొంపముంచిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయా? అంటే కొన్ని ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న కేసులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.. సిక్కోలులో పాజిటివిటీ రేటు మళ్లీ పెరుగుతుండటంతో అధికారుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటుందనుకుంటున్న వేళ కేసులు పెరగడం శ్రీకాకుళం జిల్లాలో కొత్త కలవరాన్ని పుట్టిస్తోంది. సరిగ్గా 4నెలల క్రితం రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు నమోదైన జిల్లాల్లో ఒకటిగా ఉన్న శ్రీకాకుళం.. ఆ తర్వాత కఠినమైన లాక్డౌన్ నిబంధనలతో వైరస్ను నిలువరించింది. అయితే, మొన్నటి వరకూ కొనసాగిన సండే లాక్డౌన్ కూడా.. ఎత్తేయడంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్టు కనిపిస్తోంది.
ఒక్కోరోజు జిల్లాలో 50 లోపు కేసులు నమోదైతే.. మరో రోజు దాదాపు 100 వరకూ కేసులు నమోదవుతున్నాయి. రూరల్, అర్బన్ అని తేడా లేకుండా రోజుకో ప్రాంతంలో రోజుకో మాదిరిగా పాజిటివిటీ రేటు నమోదవుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో టెస్టులను పెంచి వైరస్ వాహకులను వేగంగా గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కొవిడ్ పంజా విసురుతోంది. ఇంకా జిల్లాలో 2,778 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా.. ఇక్కడ 1800 మంది కరోనాకు బలయ్యారు. జిల్లాలో రోజుకు మూడు వందలకు పైగా కేసులు నమోదవడంతో పాటు.. మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయి. తిరుపతి కేంద్రంగా ఎక్కువ నమోదు అవుతున్నాయి. కొన్ని మండలాల్లో ఐదు శాతానికి మించి పాజిటివిటీ రేటు నమోదవడం భయపెడుతోంది. మరో 22 మండలాల్లో సైతం రెండు శాతానికి మించి కేసులు నమోదవుతున్నట్లు గుర్తించారు అధికారులు. నెల రోజుల వ్యవధిలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 60 మందికిపైగా పిల్లలు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. సైలెంట్ గా కేసులు పెరుగుతున్నా.. రాష్ట్రంలో అత్యధిక మరణాలు జిల్లాలోనే నమోదువుతున్నా… అదే స్ధాయిలో తోంబైశాతం మంది రికవరీ అవుతుండటం ఊరటనిస్తోంది. మునుపటిలా బెడ్లకు డిమాండు లేదు.. కొరత కూడా లేదు. అయితే, తాజాగా నమోదవుతున్న కేసులన్నీ.. ఎక్కువగా గ్రామాల్లోనే వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.
Also Read
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె 'మేకప్ మంత్రి'..!
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!