యాస్ తుఫాన్.. ఆ 3 జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాస్ తుఫాన్ నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్ జగన్… వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.. తుఫాన్ కదలికలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ అవసరమైన చర్యలను తీసుకోవాలన్న సీఎం.. అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.. ఇక, శ్రీకాకుళం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితులను వివరించారు.. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా జల్లులు తప్ప ప్రస్తుతానికి పెద్దగా ప్రభావం కనిపించడంలేదన్న ఆయన… ఉన్నతాధికారులంతా ఇక్కడే ఉన్నారని వివరించారు.. తాత్కాలిక నిర్మాణాల్లో కోవిడ్ రోగులు లేకుండా అన్నిరకాల చర్యలు తీసుకున్నామన్న సీఎస్.. ఆక్సిజన్ కొరత రాకుండా కూడా చర్యలు తీసుకున్నట్టు వివరించారు.. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయంగా జనరేటర్లు, డీజిల్ అన్నీ సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో తీసుకున్న చర్యలను కలెక్టర్ నివాస్ వివరించారు.. ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణాలో ఇబ్బందులు వస్తే వెంటనే సమస్య తీర్చడానికి ఇచ్ఛాపురం వద్ద ప్రత్యేక బృందాలను పెట్టామన్నారు.
మరోవైపు.. విజయనగరం జిల్లాలో పరిస్థితులను వివరించారు కలెక్టర్ జవహర్.. జిల్లాలో ఇప్పటివరకు తుఫాన్ ప్రభావం ఏమీ కనిపించలేదన్న జవహర్.. తుఫాన్ పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామన్నారు.. కోవిడ్ రోగులు ఉన్న 28 ఆస్పత్రుల్లో అన్నిరకాల జనరేటర్లు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.. నాలుగు రోజులకు సరిపడా డీజిలు అందుబాటులో ఉంచామని సీఎంకు వివరించారు.. నాలుగు రోజులకు సరిపడా మందులను ముందుగానే ఆయా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. 4 రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వలను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఇక, కోవిడ్ కేర్ సెంటర్లలో ఆహారానికి లోటులేకుండా, సిలెండర్లు కూడా సిద్ధంగా ఉంచామని.. కరెంటు సరఫరాకు ఇబ్బంది వచ్చిన పక్షంలో పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్ అందుబాటులో ఉంచుకున్నామని సీఎంకు తెలిపారు విశాఖ కలెక్టర్.. ఐఎండీ అలర్ట్స్ను మండలస్థాయి అధికారుల వరకూ పంపిస్తున్నాం.. విశాఖ జిల్లాలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయన్నారు. జిల్లాల్లో కోవిడ్రోగులకు సేవలు అందిస్తున్న సుమారు 80కి పైగా ఆస్పత్రుల్లో అన్నిరకాలుగా చర్యలు తీసుకున్నామని.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకున్నామని వెల్లడించారు.
Also Read
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
తాజావార్తలు
-
Chiru158: చిరు-బాబీ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్..
-
Ragi Egg Dosa: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఈ దోశ తింటే చాలు!
-
Modi – Meloni – Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
-
Allu Arjun: ‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్’.. అంటూ బావ కోసం బన్నీ స్పెషల్ విషెస్ ..
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!