Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Ys Jagan Mohan Reddy At Ramayapatnam Port Foundation Laying Ceremony

YS Jagan Mohan Reddy: రాష్ట్రం రూపురేఖలు మారుతాయి.. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే..

Published Date :July 20, 2022 , 1:33 pm
By Sudhakar Ravula
YS Jagan Mohan Reddy: రాష్ట్రం రూపురేఖలు మారుతాయి.. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాష్ట్రా రూపురేఖలే కాదు.. పోర్టులు ఉన్న ప్రాంతాల రూపురేఖలు త్వరలోనే మారబోతున్నాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. రామాయపట్నం పోర్టు పనులకు భూమిపూజ చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.. చెన్నై అయినా, విశాఖ అయినా, ముంబై అయినా మహానగరంగా ఎదిగాయంటే అక్కడ పోర్టులు ఉన్నాయని గుర్తుచేసిన ఆయన.. పోర్టు రావడం వల్ల ఉద్యోగావకాశాలు వస్తాయి, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి, పోర్టు వల్ల ట్రాన్స్‌పోర్టు ఖర్చుకూడా బాగా తగ్గుతుంది.. రాష్ట్రానికే కాదు, ఈప్రాంతం రూపురేఖలు మారుతాయని వెల్లడించారు.. రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమల వచ్చినా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తీసుకు వచ్చామని.. పోర్టులోకాని, దీనికి అనుబంధంగా ఉన్న, వచ్చే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయని స్పష్టం చేశారు.. మన దగ్గర దాదాపు 6 పోర్టులు ఉన్నాయి.. కృష్ణపట్నం, కాకినాడలో 2, విశాఖపట్నం, గంగవరం తదితర పోర్టుల ద్వారా ఎగుమతులు, దిగుమతులు కొనసాగుతున్నాయి.. దీనికి మరో 4 పోర్టులు అదనంగా వస్తున్నాయని.. భావనపాడు, కాకినాడ గేట్‌వే, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులను నిర్మిస్తున్నామని తెలిపారు.

ఇక, ఈ పోర్టుల ద్వారా మరో 100 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం వస్తుందని పేర్కొన్నారు సీఎం వైఎస్‌ జగన్.. దీంతో పాటు 9 ఫిషింగ్‌ హార్బర్లు కూడా కడుతున్నాం.. వీటి నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి.. మరో 2 నెలల్లో మిగిలిన పోర్టులకు భూమి పూజ చేస్తామని తెలిపారు.. 9 ఫిషింగ్‌ హార్బర్లు, 4 పోర్టులతో మౌలిక సదుపాయాలు ఊపందుకుంటున్నాయి.. 9 ఫిషింగ్‌ హార్బర్ల ద్వారా దాదాపు లక్షమందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.. దీంతో, గుజరాత్‌ లాంటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరంలేదన్నారు. ఒక్కో పోర్టులో నేరుగా వచ్చే ఉద్యోగాలు 3–4వేలు ఉంటాయని.. పరోక్షంగా వచ్చే ఉద్యోగాలు సంగతి చెప్పనవసరంలేదు.. అన్ని పోర్టుల ద్వారా లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని వెల్లడించారు.

Also Read

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
  • AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
  • Off The Record : టీడీపీ అధిష్టానం మీద వత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారా?

చంద్రబాబు డ్రామా చేశారు..
మరోవైపు, చంద్రబాబుపై మండిపడ్డారు సీఎం వైఎస్‌ జగన్.. 2019 ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగాయి.. 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన అంటూ డ్రామా చేశారని దుయ్యబట్టిన ఆయన.. డీపీఆర్‌ లేదు, భూ సేకరణ కూడా చేయలేదు.. అయినా, ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు.. 5 సార్లు ఏమీ చేయకుండా 2 నెలల ముందు కొబ్బరికాయ కొట్టే పని చేశారు.. ఇంతకన్నా అన్యాయం, మోసం ఏమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు.. గత పాలనలో ఇలాంటివే చూశాం.. రుణమాఫీ అంటూ రైతులకు, అక్క చెల్లెమ్మలను మోసం చేశారు.. చదవుకుంటున్న పిల్లలన్నీ కూడా మోసం చేశారు, చివరకు ప్రాంతాల పేరిట మోసాలు చేశారని ఫైర్‌ అయ్యారు వైఎస్‌ జగన్.

పూర్తిగా భూమిని సేకరించాం
రామాయపట్నం పోర్టు పనుల కోసం ఇవాళ పూర్తిగా భూమిని సేకరించాం, రూ.3,700కోట్లతో పనులు కూడా మొదలుపెట్టాం.. మొదటి దశలో 4 బెర్తులు అందుబాటులోకి వస్తాయి.. మరో 6 బెర్తులు కూడా ఇక్కడే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.. ఒక్కో బెర్తుకు రూ.200 కోట్లు ఖర్చు చేస్తే చాలు.. ఏకంగా 50 మిలియన్‌ టన్నుల కార్గోను కూడా రవాణా చేయవచ్చన్న ఆయన.. పోర్టు వల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను.. పోర్టు రావడానికి సహకరించిన గ్రామాలకు నా కృతజ్ఞతలు అన్నారు.. నిండు మనస్సుతో వారికి రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు చెప్తున్నాను.. మీరు భూములిచ్చి పోర్టు వచ్చేందుకు దోహదపడ్డారు.. చరిత్రలో సువర్ణాధ్యాయానికి మీరు తెరలేపారు.. మన గ్రామాల నుంచి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. పోర్టుకు అనుసంధానంగా ఒక పారిశ్రామిక కారిడర్‌ను తీసుకురావాలని ఎమ్మెల్యే ప్రతాప్‌ అడుగుతున్నారు.. రాబోయే రోజుల్లో అడుగులు ముందుకేస్తామన్న ఆయన.. పోర్టు కారణంగా కందుకూరు టౌన్‌ ఒక హబ్‌గా తయారవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కందుకూరు బైపాస్‌ రోడ్డు సేకరణకు డబ్బు మంజూరుచేస్తున్నాం.. కందుకూరు మున్సిపాల్టీలో అభివృద్ధికీ తగిన సహాయం అందిస్తాం.. రాళ్లపాడు లెఫ్ట్‌కెనాల్‌ విస్తరణకు ని«ధులు మంజూరుకూడా చేస్తున్నాం అని వెల్లడించారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM YS Jagan
  • CM YS Jagan Mohan Reddy
  • Ramayapatnam Port
  • Ramayapatnam Port Foundation Laying Ceremony

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions