PMK Chief Anbumani: కుల గణన చేయడంలో స్టాలిన్ ఫెయిల్.. హనీమూన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తున్న టీవీకే!
- రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.5 శాతం వన్నీయర్ అగ్నికుల క్షత్రియులు..
- అగ్నికుల వన్నీయర్ కులానికి ప్రత్యేక కేటగిరి ఇవ్వాలని ఏపీ సర్కార్ ను కోరుతున్నాం..
- కుల గణన చేయడంలో స్టాలిన్ ఫెయిల్.. హనీమూన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తున్న టీవీకే: పీఎంకే పార్టీ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PMK Chief Anbumani: నా స్నేహితుడు మోపిదేవి వెంకటరమణ కుమారుడు పెళ్లి కోసం వచ్చాను అని పట్టాలి మక్కల్ కట్చి పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.5 శాతం వన్నీయర్ అగ్నికుల క్షత్రియ కులస్తులు ఉన్నారు.. వన్నీయర్ కులం నుంచి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని నా స్నేహితుడు మంత్రి నారా లోకేష్ ను కోరాను.. అగ్నికుల వన్నీయర్ లో కులానికి ప్రత్యేక కేటగిరి ఇవ్వాలని కోరుతున్నాం.. కుల గణన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతున్నాను.. గత ముఖ్యమంత్రి 80 శాతం పూర్తి చేశాడు.. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతుంది అన్నారు. కాగా, మిగతా రాష్ట్రాల్లో కుల గణన ఇప్పటికే పూర్తి చేశారు.. కులాల వారీగా కుల గణన జరగాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఏపీ సీఎంను కలుస్తానని పట్టాలి మక్కల్ కట్చి చీఫ్ అన్బుమణి పేర్కొన్నారు.
Read Also: BSNL: బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ ప్లాన్.. డైలీ 2.5GB డేటా.. తక్కువ ధరకే
Also Read
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
అలాగే, తమిళనాడులో కుల గణన కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని పట్టాలి మక్కల్ కట్చి పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ చెప్పుకొచ్చారు. విద్య, ఉద్యోగ అవకాశం కోసమే పోరాటం చేస్తున్నాం.. కుల గణన చేయడంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఫెయిల్ అయ్యాడు అని విమర్శించారు. దేశంలోని ఏడు రాష్ట్రాలు కుల గణన పూర్తి చేశాయి.. రాబోయే రోజుల్లో PMK పార్టీని రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తామని తెలిపారు. ఎంతోమంది ప్రజలు PMK పార్టీ రావాలని కోరుకుంటున్నారు.. సమాజానికి న్యాయం సిద్ధాంతంతో పీఎంకే పార్టీ నడుస్తుంది అన్నారు. ఇక, టీవీకే పార్టీ ప్రస్తుతం హనీమూన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తున్నారు.. ఆ పార్టీ సిద్ధాంతాలు ఇంకా స్పష్టంగా ప్రజలకు చెప్పలేదన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూద్దామని అన్బుమణి రామదాస్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
-
Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
-
Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
-
UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
-
Samsung Galaxy Z Slide: 10-ఇంచెస్ డిస్ప్లేతో సామ్ సంగ్ రోలబుల్ స్మార్ట్ఫోన్.. 2028లో మార్కెట్లోకి?
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!