CM Jagan: లా నేస్తం నిధుల విడుదల.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan Released YSR Law Nestham Funds: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ‘వైఎస్సార్ లా నేస్తం’ నిధులను విడుదల చేశారు. జూనియర్ లాయర్ల ఖాతాల్లోకి రూ. కోటి 55 వేలు జమ చేశారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 2,011 మంది జూనియర్ న్యాయవాదులకు లబ్ది చేకూరుతుంది. మూడేళ్లకు రూ.5 వేల చొప్పున వారికి ఆర్థిక సాయం అందనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. న్యాయవాదులుగా రిజిస్టర్ చేసుకున్న వారికి మొదటి మూడు సంవత్సరాలు చాలా ఇబ్బందులుంటాయని తనకు పాదయాత్రలో చెప్పారని గుర్తు చేసుకున్నారు. న్యాయవాదులకు అండగా ఉండేందుకే ఈ ‘లా నేస్తం’ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. తమ కాళ్లమీద తాము నిలబడగలిగే వృత్తిలో న్యాయవాదులున్నారని.. ప్రభుత్వం తోడుగా నిలబడ్డం వల్ల డబ్బులేని పేదవాడికి సహాయం చేయగులుగుతారనే విశ్వాసం ఉంటుందని అన్నారు.
Rajendra Prasad: బిగ్ బాస్ సోహెల్ తో కలిసి నటిస్తున్న నటకిరీటీ…
Also Read
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
ఈ మూడున్నరేళ్లలో దాదాపు 4,248 మంది లాయర్లను తాము ప్రతినెలా ఆదుకున్నామని జగన్ చెప్పారు. వాళ్లు స్థిరపడటానికి వారికి తోడ్పాటు అందించామని, రూ. 35.4 కోట్లు సహాయంగా ఇచ్చామని, దాదాపు కోటి రూపాయల పైన వారికి జమ చేస్తున్నామని అన్నారు. ఈ పథకంలో కొత్తగా కొన్ని మార్పులు తీసుకొచ్చామన్న ఆయన.. ఆరు నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి 2 దఫాలుగా నిధులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. వారి అవసరాలు తీర్చుకునేలా వారికి ఉపయోగపడుతుందని రూ. 100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశామన్నారు. దాదాపు రూ.25 కోట్ల మేర లాయర్లకు కొవిడ్ సమయంలో మంచి జరిగిందన్నారు. అత్యంత పారదర్శకంగా దీన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఆధీకృత వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చని.. సంతృప్త స్థాయిలో దీన్ని అమలు చేస్తున్నామని, ఒక్కరు కూడా మిస్ కాకూడదనే ఉద్దేశంతో అమలు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు.
Merugu Nagarjuna: చంద్రబాబును అన్ని సామాజిక వర్గాలు కలిసి తరిమికొడతాయి
మంచి జరగాలనే తపన, తాపత్రయంతో పాదయాత్రలో మాట ఇచ్చామని.. దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నామని జగన్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మంచిని పొందుతున్న లాయర్లు, పేదవాడిపట్ల అదే అంకిత భావాన్ని చూపాలని కోరుతున్నానని ఆకాంక్షించారు. మీమీ వృత్తుల్లో మరింత రాణించాలని మనసారా కోరుకుంటున్నానని న్యాయవాదులను ఉద్దేశించి వెల్లడించారు.
తాజావార్తలు
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
God Of War : త్రివిక్రమ్తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
-
Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
-
New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
-
Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!