CM Jagan: లా నేస్తం నిధుల విడుదల.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan Released YSR Law Nestham Funds: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ‘వైఎస్సార్ లా నేస్తం’ నిధులను విడుదల చేశారు. జూనియర్ లాయర్ల ఖాతాల్లోకి రూ. కోటి 55 వేలు జమ చేశారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 2,011 మంది జూనియర్ న్యాయవాదులకు లబ్ది చేకూరుతుంది. మూడేళ్లకు రూ.5 వేల చొప్పున వారికి ఆర్థిక సాయం అందనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. న్యాయవాదులుగా రిజిస్టర్ చేసుకున్న వారికి మొదటి మూడు సంవత్సరాలు చాలా ఇబ్బందులుంటాయని తనకు పాదయాత్రలో చెప్పారని గుర్తు చేసుకున్నారు. న్యాయవాదులకు అండగా ఉండేందుకే ఈ ‘లా నేస్తం’ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. తమ కాళ్లమీద తాము నిలబడగలిగే వృత్తిలో న్యాయవాదులున్నారని.. ప్రభుత్వం తోడుగా నిలబడ్డం వల్ల డబ్బులేని పేదవాడికి సహాయం చేయగులుగుతారనే విశ్వాసం ఉంటుందని అన్నారు.
Rajendra Prasad: బిగ్ బాస్ సోహెల్ తో కలిసి నటిస్తున్న నటకిరీటీ…
Also Read
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
ఈ మూడున్నరేళ్లలో దాదాపు 4,248 మంది లాయర్లను తాము ప్రతినెలా ఆదుకున్నామని జగన్ చెప్పారు. వాళ్లు స్థిరపడటానికి వారికి తోడ్పాటు అందించామని, రూ. 35.4 కోట్లు సహాయంగా ఇచ్చామని, దాదాపు కోటి రూపాయల పైన వారికి జమ చేస్తున్నామని అన్నారు. ఈ పథకంలో కొత్తగా కొన్ని మార్పులు తీసుకొచ్చామన్న ఆయన.. ఆరు నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి 2 దఫాలుగా నిధులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. వారి అవసరాలు తీర్చుకునేలా వారికి ఉపయోగపడుతుందని రూ. 100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశామన్నారు. దాదాపు రూ.25 కోట్ల మేర లాయర్లకు కొవిడ్ సమయంలో మంచి జరిగిందన్నారు. అత్యంత పారదర్శకంగా దీన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఆధీకృత వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చని.. సంతృప్త స్థాయిలో దీన్ని అమలు చేస్తున్నామని, ఒక్కరు కూడా మిస్ కాకూడదనే ఉద్దేశంతో అమలు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు.
Merugu Nagarjuna: చంద్రబాబును అన్ని సామాజిక వర్గాలు కలిసి తరిమికొడతాయి
మంచి జరగాలనే తపన, తాపత్రయంతో పాదయాత్రలో మాట ఇచ్చామని.. దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నామని జగన్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మంచిని పొందుతున్న లాయర్లు, పేదవాడిపట్ల అదే అంకిత భావాన్ని చూపాలని కోరుతున్నానని ఆకాంక్షించారు. మీమీ వృత్తుల్లో మరింత రాణించాలని మనసారా కోరుకుంటున్నానని న్యాయవాదులను ఉద్దేశించి వెల్లడించారు.
తాజావార్తలు
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
-
MS Dhoni Retirement: ఎంఎస్ ధోనీ చివరి మ్యాచ్ ఆడనున్నాడా?.. చెపాక్లో ఎమోషనల్ ఫేర్వెల్?
-
TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..