Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Jagan Released Amma Vodi Scheme Funds In Srikakulam District

CM Jagan: TMF, SMFల కోసం ప్రతి అక్కచెల్లెమ్మ రూ.2వేలు ఇవ్వాలి

Published Date :June 27, 2022 , 12:48 pm
By Ramesh Nalam
CM Jagan: TMF, SMFల కోసం ప్రతి అక్కచెల్లెమ్మ రూ.2వేలు ఇవ్వాలి
  • Follow Us :
  • google news
  • dailyhunt

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో జగనన్న అమ్మ ఒడి నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. 43 లక్షల 96 వేలమంది తల్లుల ఖాతాల్లో నేరుగా రూ.6,595 కోట్లను జమ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అమ్మ ఒడి స్కీం ద్వారా గత మూడేళ్లలో అక్క చెల్లెమ్మల ఖాతాలలో మొత్తం రూ.19,618 కోట్లను జమ చేశామని తెలిపారు. ప్రతి తల్లి తమ బిడ్డలను మంచిగా చదివించాలని తాపత్రయపడుతుందని.. అలాంటి వాళ్లకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం జగన్ అన్నారు. అందుకే పిల్లలను బడికి పంపిస్తే ప్రతి ఏటా రూ.15వేలు అందిస్తున్నామన్నారు. ఎంత ఎక్కువ మంది చదివితే తనకు అంత ఎక్కువ ఆనందం కలుగుతుందన్నారు. పిల్లలు బడికి వెళ్తేనే ఈ పథకం వస్తుందని ఆనాడే జీవో ఇచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. 75 శాతం హాజరు తప్పనిసరి చేసింది పిల్లలందరూ స్కూలుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే అని స్పష్టం చేశారు. ఈ నిబంధన అమలు చేయడంతోనే 51వేల మంది పిల్లలకు అమ్మ ఒడి ఇవ్వలేకపోయామన్నారు. 1.14 శాతం మందికి ఈ పథకం డబ్బులు ఇవ్వలేకపోవడం చాలా బాధగానే ఉందన్నారు. భవిష్యత్‌లో 75 శాతం హాజరు ఉండాలంటే ఈ నిబంధన కఠినంగా అమలు చేయాలనే బాధ్యతతో పనిచేస్తున్నందున అందరికీ న్యాయం చేయలేకపోతున్నామని తెలిపారు.

మరోవైపు చదువుకునే చిన్నారులందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం జగన్ వెల్లడించారు. ప్రతి పిల్లాడు , పాప బ్రతుకు మారాలని తపనతోనే అడుగులు వేస్తున్నామన్నారు. అమ్మ ఒడి , నాడు నేడు , విద్యాకానుక, గోరుముద్ద వంటి పథకాలను అమలు చేస్తున్నామని.. ఇటీవల బైజూస్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల విద్యలో మరింత నాణ్యత పెరుగుతుందని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే టాయ్‌లెట్లు శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యమని.. అందుకే అమ్మ ఒడి ద్వారా ఇచ్చే నిధుల్లో కొన్ని నిధులను టాయ్‌లెట్ మెయింటెన్స్ ఫండ్ (TMF) కింద మినహాయించుకుంటున్నామని జగన్ వివరించారు. అటు నాడు నేడు కింద స్కూళ్ల రూపురేఖలను మార్చేశామని.. కానీ ఈ స్కూళ్లను అలాగే వదిలేస్తే మరో నాలుగేళ్లలో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని.. అలా జరగకుండా స్కూల్ మెయింటెన్స్ ఫండ్ (SMF) కింద కూడా కొంత మినహాయించుకున్నట్లు తెలిపారు. TMF, SMFల కోసం ప్రతి అక్కచెల్లెమ్మ అమ్మ ఒడి నిధుల నుంచి రూ.2వేలు ఇవ్వాలని సీఎం జగన్ కోరారు.

Also Read

  • CM Chandrababu: ప్రజలకు ఇదే నా హామీ.. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచం!
  • Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
  • Venkata Krishnapuram Crime: లీడ్ కనుక్కునేందుకు ఎవ్వరూ ప్రాణాలతో లేరు.. వెంకటకృష్ణపాలెంలో విషాదంపై పుత్తూరు డీఎస్పీ!
  • Off The Record : పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య మంటలు

అటు అధికారంలోకి వచ్చిన మూడేళ్లుగా పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నట్లు సీఎం జగన్ గుర్తుచేశారు. కుటుంబం , దేశం తలరాతలు మార్చగలిగేది ఒక్క చదువే అని.. చదువులు ఎక్కువ ఉన్న దేశాలలో ఆదాయాలు ఎక్కువ ఉన్నాయని జగన్ తెలిపారు. తలసరి ఆదాయం ఎక్కువ ఉండటానికి కారణం చదువే అన్నారు. చదువే నిజమైన ఆస్తి అని.. చదువుపై ఖర్చు చేసే ప్రతి పైసా పవిత్రమైన పెట్టుబడితో సమానమన్నారు. ఒకతరాన్ని , మనిషి తలరాతలను మార్చే శక్తి విద్యకే ఉందని జగన్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లినా బ్రతికే సత్తా చదువుతోనే వస్తుందన్నారు. దేశంలో అన్ని రాష్ర్టాల కంటే మిన్నగా మన పిల్లల చదువులు ఒక హక్కుగా అందాలని ముందుకు వెళ్తున్నామని జగన్ పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amma Vodi Scheme
  • Andhra Pradesh
  • cm jagan
  • jagananna ammavodi

తాజావార్తలు

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • CM Chandrababu: ప్రజలకు ఇదే నా హామీ.. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచం!

  • IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!

  • Geetha MAdhuri : నేను నోరు తెరిస్తే తట్టుకోలేరు.. కాపురాలు కూలిపోవడం ఖాయం..

  • Tamil Nadu Elections 2026: ఓటు హక్కు వినియోగించుకున్న సూర్య-జ్యోతిక జంట!

ట్రెండింగ్‌

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions