AP CM Jagan: 146 కొత్త 108 అంబులెన్స్లను ప్రారంభించిన సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Jagan: పేదలే కాకుండా ఎక్కడ ఎటువంటి వైద్య సహాయం వచ్చి రవాణా కోసం ఎదురు చూసే వారికి 108 అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అంబులెన్స్ సేవలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్నాయి. అంబులెన్స్ సేవలు నిరుపేదలతోపాటు ప్రమాదాల బారిన పడిన వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండటమే కాకుండా.. ప్రమాదాల సమయంలో త్వరగా అక్కడికి చేరుకొని వారికి ప్రధమ చికిత్సను అందించి.. మెరుగైన వైద్యం కోసం దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలను కాపాడుతోంది. అటువంటి 108 అంబులెన్స్ ల సంఖ్యను పెంచాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం సోమవారం కొత్తగా 146 అంబులెన్స్ లను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 146 కొత్త 108 అంబులెన్స్లను ప్రారంభించారు. ఇప్పటికే కొనసాగుతున్న అంబులెన్స్ లకు అదనంగా మరో 146 అంబులెన్స్ లను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ ఈరోజు కొత్తగా 146 అంబులెన్స్లను జెండా ఊపి ప్రారంభించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు విడదల రజని, ఉషాశ్రీ చరణ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబులెన్స్లను సీఎం జగన్ పరిశీలించారు. 2,50,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి తరచూ మరమ్మతులకు గురవుతున్న పాత అంబులెన్స్ల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 34.79 కోట్లను ఖర్చు చేసి ఈ కొత్త అంబులెన్స్లను తీసుకొచ్చింది.
Read also: Mohan Lal: ఏక్తా కపూర్ తో మలయాళ సూపర్ స్టార్ మీటింగ్ కి కారణం ఏంటి?
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
2019లో కేవలం 531 అంబులెన్స్లు ఉపయోగంలో ఉన్నాయి. వాటిలో 336 అంబులెన్స్లు మాత్రమే పనిచేసే స్థితిలో ఉన్నాయి. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త అంబులెన్స్లను కొనుగోలు చేయాలని ఆదేశించారు. 2020లో 412 కొత్త అంబులెన్స్లను తీసుకొచ్చామని.. 26 నవజాత శిశువుల అంబులెన్స్లతో కలిపి మొత్తం అంబులెన్స్ల సంఖ్య 748కి చేరుకుందని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ప్రాణాలను రక్షించే పరికరాలతో సహా అంబులెన్స్ల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం దాదాపు రూ. 96.50 కోట్లను వెచ్చించిందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!