CM Jagan: మళ్ళీ 2వేల కోట్లు అప్పుచేసిన ఏపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు అప్పులు చేయాల్సి వస్తోంది. తాజాగా జగన్ ప్రభుత్వం మరో రెండు వేల కోట్ల అప్పు చేసింది. రిజర్వు బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్లను వైసీపీ ప్రభుత్వం వేలం వేసింది. వెయ్యి కోట్లు 8 సంవత్సరాల కాలానికి 7.63 శాతం వడ్డీతో వేలం వేసింది. మరో వెయ్యి కోట్లకు ఐదు సంవత్సరాల కాలానికి 7.46 శాతం వడ్డీతో బాండ్ల వేలం జరిగింది. గత వారం రోజుల్లో ఐదు వేల కోట్ల రూపాయలు రుణాన్ని ఏపీ ప్రభుత్వం సేకరించింది.
ఎఫ్ఆర్బిఎం కింద రూ.36 వేల కోట్లకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రూ.5 వేల కోట్లను సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రుణంగా జగన్ సర్కార్ సమీకరించింది. మరో 3 నెలల్లో రూ.36 వేల కోట్లు పరిమితి పూర్తయ్యే అవకాశం ఉన్న ఈ తరుణంలో మళ్లీ అప్పు చేసింది. ఏపీ ప్రభుత్వ అప్పులపై ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలో రాజకీయ పార్టీల పొత్తుల గురించి కాదు, పెరిగి పోతున్న అప్పుల గురించి మాట్లాడాలని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఇది చాలదన్నట్టు అప్పుల గురించి తమకు వివరాలు పంపాలని అకౌంటెంట్ జనరల్ కార్యాలయం కోరింది. ఈ నెల 31వ తేదీలోగా కార్పోరేషన్లకు గ్యారంటీలపై వివరాలు అడిగింది.
Also Read
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
ఇదిలా వుంటే.. విద్యుత్ సంస్కరణలు అమలు చేసినందుకు ప్రోత్సాహకంగా అదనపు అప్పులు చేయవచ్చని కేంద్రం వివిధ రాష్ట్రాలకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఏపీకి అదనంగా రూ. 3,716 కోట్లు అప్పు చేసేందుకు గత నెలలో కేంద్రం అవకాశం ఇచ్చింది. మొత్తంగా పది రాష్ట్రాలకు రూ. 28,204 కోట్లు అదనప్పు అప్పులు చేయడానికి అనుమతి ఇచ్చింది. నెలాఖరు వచ్చిందంటే నిధుల సమీకరణకు ఏపీ ప్రభుత్వం ఆపపోపాలు పడాల్సి వస్తోంది. గతంతో పోలిస్తే కోవిడ్ సంక్షోభం ముగియడంతో పన్నుల రాబడి క్రమేపీ పెరుగుతోంది.
Tdp Support Venkayamma: వెంకాయమ్మకు టీడీపీ అండ.. వైసీపీ దాడిపై ఖండన
తాజావార్తలు
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!