పవన్ ను ఓడించిన ఎమ్మెల్యేలకు జగన్ గిఫ్ట్…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ అధికారంలోకి వచ్చి అప్పుడే దాదాపు రెండున్నరేళ్లు కావస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారానికి ముందుగానే రెండున్నరేళ్ల తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని హింట్ ఇచ్చారు. అందుకనుగుణంగా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ రిపోర్టు తెప్పించుకొని కొత్త క్యాబినెట్ కూర్పుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
పరిస్థితులన్నీ అనుకూలిస్తే దసరా లేదంటే దీపావళి నాటికి ఏపీలో కొత్త క్యాబినెట్ కొలువుదీరడం ఖాయమనే టాక్ విన్పిస్తుంది. ఈనేపథ్యంలో ఆశావహులంతా జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నవారికి తమ పదవి ఎక్కడ పోతుందననే బెంగపట్టుకున్నట్లు తెలుస్తోంది.
Also Read
గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండుచోట్ల పోటీ చేయగా ఒక్కచోట కూడా గెలువలేదు. గాజువాక, భీమవరం రెండుస్థానాల్లో పవన్ కల్యాణ్ ను వైసీపీ అభ్యర్థులు ఓడించారు. విశాఖ జిల్లా గాజువాకలో పవన్ కల్యాణ్ కు 30,905 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డికి 34,712 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ కల్యాణ్ పై వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ 3,900ఓట్లతో విజయం సాధించాడు.
ఈ నేపథ్యంలోనే వీరిద్దరిలో ఒకరికి మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమగోదావరిలో వైసీపీ గత ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. జిల్లాలోని 15స్థానాల్లో 13 స్థానాల్లో వైసీపీ కైవసం చేసుకుంది. ఈక్రమంలోనే ఈ జిల్లా నుంచి జగన్ క్యాబినెట్లో ముగ్గురికి చోటుదక్కింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆళ్ల నానికి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా తానేటి వనితకు, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా శ్రీరంగనాథరాజుకు ఛాన్స్ దక్కింది. త్వరలోనే కొత్త మంత్రివర్గం కొలువు దీరనుండటంతో ఈ మంత్రుల పనితీరును సీఎం జగన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
వీరి పనితీరు ఆధారంగా ఒకరిద్దరికి ఉద్వాసన పలుకుతారని తెలుస్తోంది. ఈ స్థానంలో గ్రంథి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం సమంజసమేనని పార్టీ పెద్దలు సైతం ఒప్పుకుంటున్నారట. దీనికితోడు జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను ఓడిస్తే మంత్రి పదవి ఇస్తానని గ్రంథి శ్రీనివాస్ కు హామీ ఇచ్చారనే టాక్ విన్పిస్తుంది.
ఈ నేపథ్యంలోనే జగన్ క్యాబినెట్లో గ్రంథి శ్రీనివాస్ కు చోటుదక్కుతుందనే ప్రచారం సాగుతోంది. ఇందుకు తగ్గట్టుగా గ్రంథి శ్రీనివాస్ సైతం జనసేన కార్యకర్తలపై తరుచూ విరుచుకుపడుతున్నారు. తాజాగా జన సైనికులను ఆయన తాలిబన్లతో పోల్చడం దుమారం రేపింది. సీఎం జగన్ దృష్టిలో పడేందుకు ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ ను ఓడించడం కంటే పెద్ద అచివ్మెంట్ ఏం ఉంటుందని గ్రంథి వర్గం అధిష్టానం ముందు తమ వాదనలు విన్పిస్తోంది. భీమవరంలో జన సైనికులను ఎదుర్కోవాలంటే మంత్రి పదవి ఉండాల్సిందేనని ఆయన వర్గం భావిస్తుందట. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రంథి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
- Tags
- cm jagan
- janasena
- pawan kalyan
- ycp
తాజావార్తలు
-
Suriya : ఒకప్పడు వరుస ప్లాప్స్.. ఇప్పుడు 3నెలల్లో రెండు బ్లాక్ బస్టర్స్
-
Gandhari: కళ్లకు గంతలతో తాప్సీ హై-ఇంటెన్సిటీ యాక్షన్.. మహాభారతం స్ఫూర్తితో వస్తున్న ‘గాంధారి’..
-
Donald Trump: ఫోటోలో మేము కోపంగా కనిపిస్తుండవచ్చు.. కానీ, మేము స్నేహితులమే.. కిమ్తో పాత ఫోటో షేర్ చేసిన ట్రంప్
-
Maharashtra: బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్లకు ఎఫ్డీఏ షాకాజ్ నోటీసులు
-
Yashasvi Jaiswal Record: 30 వేదికలు, 30 మ్యాచ్లు.. టీమిండియా యువ ఓపెనర్ ఖాతాలో వింత రికార్డు!
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!