CM Chandrababu: వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎర్ర చందనంపై ఆసక్తికర వ్యాఖ్యలు
- అమరావతి: వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్..
- హోం, మున్సిపల్ డైరెక్టర్, కమిషనర్ కార్యాలయాలు, జైళ్ల శాఖలు పూర్తిగా పని చేయడం లేదు..
- ఎక్కడ ఏ పనిలో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్ చేయొచ్చు.. కానీ ఇంకా మంత్రులు అలవాటు పడలేదు..
- ఎవరు తప్పు చేశారో గుర్తించేలా బ్లాక్చైన్ టెక్నాలజీని తీసుకొచ్చాం: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ శాఖల పని తీరుపై ఫీడ్ బ్యాక్ ను విశ్లేషించారు. ఈ సందర్భంగా పలు శాఖలపై సీరియస్ అయ్యారు. హోం, మునిపల్ శాఖ డైరెక్టర్, కమిషనర్ కార్యాలయం, జైళ్ల శాఖలు పూర్తిగా పని చేయడం మానేశాయని తెలిపారు. అలాగే, రెవెన్యూ శాఖలో ఇంకా 12 శాతం మందిని ఆఫీసులకు రమ్మని పిలుస్తున్నారు.. ఫిర్యాదుదారులు డిపార్ట్మెంట్ కి రావాల్సిన అవసరం లేకుండా చూడాలని ప్రయత్నిస్తుంటే రెవెన్యూ శాఖ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ ఏ పనిలో ఉన్నా ఫైళ్ళ క్లియరెన్స్ చేయొచ్చు, కానీ ఇంకా మంత్రులు అలవాటు పడడం లేదు అని పేర్కొన్నారు. జిల్లాల నుంచి ఏవైనా రిపోర్ట్స్ కావాలంటే సీనియర్ అధికార్లు, కలెక్టర్లను డిస్టర్బ్ చేయడం కంటే RTGS ను అడిగి తీసుకోండి అని సీఎం చంద్రబాబు సూచించారు.
Read Also: Sandy Master: చిన్నప్పుడు చచ్చిన మేక కళ్ళని ఏడిపించారు.. ఇప్పుడవే సినిమా అవకాశాలు తెస్తున్నాయ్!
Also Read
- Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
- Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Sajjala Ramakrishna Reddy: హామీలు గాలికొదిలేశారు.. సర్కార్పై సజ్జల తీవ్ర విమర్శలు..
అయితే, అక్టోబర్ 2వ తేదీ నుంచి 100 శాతం ఫైళ్లను ఆన్ లైన్ లో ఉంచాలి అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎవరు తప్పు చేశారో తెలుసుకునేలా బ్లాక్ చైన్ టెక్నాలజీ తెచ్చామన్నారు. అలాగే, ఎర్ర చందనంపై కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్ర చందనంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. దాని విలువ లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని భావించాం.. అయితే. మీరు దాన్ని నార్మలైజ్ చేసేశారని పేర్కొన్నారు. ఇకనైనా ప్రాపర్ ప్లానింగ్ చేయండి.. ఎర్రచందనం అమ్మకం ద్వారా ఆదాయం రావాలని తెలియజేశారు. ఎందుకు ఇంత గట్టిగా చెపుతున్ననంటే అది యూనిక్, కేవలం శేషాచలం కొండల్లో మాత్రమే ఉంటుంది.. అదే సమయంలో డిమాండు కూడా ఉంటుంది అని చంద్రబాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!