CM Chandrababu: వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎర్ర చందనంపై ఆసక్తికర వ్యాఖ్యలు
- అమరావతి: వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్..
- హోం, మున్సిపల్ డైరెక్టర్, కమిషనర్ కార్యాలయాలు, జైళ్ల శాఖలు పూర్తిగా పని చేయడం లేదు..
- ఎక్కడ ఏ పనిలో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్ చేయొచ్చు.. కానీ ఇంకా మంత్రులు అలవాటు పడలేదు..
- ఎవరు తప్పు చేశారో గుర్తించేలా బ్లాక్చైన్ టెక్నాలజీని తీసుకొచ్చాం: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ శాఖల పని తీరుపై ఫీడ్ బ్యాక్ ను విశ్లేషించారు. ఈ సందర్భంగా పలు శాఖలపై సీరియస్ అయ్యారు. హోం, మునిపల్ శాఖ డైరెక్టర్, కమిషనర్ కార్యాలయం, జైళ్ల శాఖలు పూర్తిగా పని చేయడం మానేశాయని తెలిపారు. అలాగే, రెవెన్యూ శాఖలో ఇంకా 12 శాతం మందిని ఆఫీసులకు రమ్మని పిలుస్తున్నారు.. ఫిర్యాదుదారులు డిపార్ట్మెంట్ కి రావాల్సిన అవసరం లేకుండా చూడాలని ప్రయత్నిస్తుంటే రెవెన్యూ శాఖ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ ఏ పనిలో ఉన్నా ఫైళ్ళ క్లియరెన్స్ చేయొచ్చు, కానీ ఇంకా మంత్రులు అలవాటు పడడం లేదు అని పేర్కొన్నారు. జిల్లాల నుంచి ఏవైనా రిపోర్ట్స్ కావాలంటే సీనియర్ అధికార్లు, కలెక్టర్లను డిస్టర్బ్ చేయడం కంటే RTGS ను అడిగి తీసుకోండి అని సీఎం చంద్రబాబు సూచించారు.
Read Also: Sandy Master: చిన్నప్పుడు చచ్చిన మేక కళ్ళని ఏడిపించారు.. ఇప్పుడవే సినిమా అవకాశాలు తెస్తున్నాయ్!
Also Read
- Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
- Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
- Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
- Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
అయితే, అక్టోబర్ 2వ తేదీ నుంచి 100 శాతం ఫైళ్లను ఆన్ లైన్ లో ఉంచాలి అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎవరు తప్పు చేశారో తెలుసుకునేలా బ్లాక్ చైన్ టెక్నాలజీ తెచ్చామన్నారు. అలాగే, ఎర్ర చందనంపై కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్ర చందనంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. దాని విలువ లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని భావించాం.. అయితే. మీరు దాన్ని నార్మలైజ్ చేసేశారని పేర్కొన్నారు. ఇకనైనా ప్రాపర్ ప్లానింగ్ చేయండి.. ఎర్రచందనం అమ్మకం ద్వారా ఆదాయం రావాలని తెలియజేశారు. ఎందుకు ఇంత గట్టిగా చెపుతున్ననంటే అది యూనిక్, కేవలం శేషాచలం కొండల్లో మాత్రమే ఉంటుంది.. అదే సమయంలో డిమాండు కూడా ఉంటుంది అని చంద్రబాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
-
CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
-
India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!