ప్రపంచ గమనంలో భారతీయుల పాత్ర, నాలెడ్జ్ ఎకానమీలో దేశం సాధించబోతున్న ప్రగతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఐటీ రంగం నుండి గ్రీన్ ఎనర్జీ వరకు, జనాభా విధానం నుండి ఏఐ (AI) వరకు భవిష్యత్ భారత్ ఎలా ఉండబోతోందో తన విజన్ను పంచుకున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ డిప్లొమాట్లు భారతీయులేనని చంద్రబాబు కొనియాడారు. ఎక్కడికి వెళ్లినా స్థానిక సంస్కృతులతో కలిసిపోవడంలో భారతీయులకు…