CJI NV Ramana: అప్పట్లో ‘రత్తాలు-రాంబాబు’ కోసం తెగ ఎదురుచూసేవాళ్లం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJI NV Ramana: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం నాడు విశాఖలో పర్యటించారు. విశాఖ వచ్చిన ఎన్వీ రమణకు అంకోసా హాలులో రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాథశాస్త్రి) శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణను రావిశాస్త్రి కుటుంబీకులు ఘనంగా సత్కరించారు. రావిశాస్త్రికి నివాళులు అర్పించిన అనంతరం శతజయంతి సభలో జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. రావిశాస్త్రి కవిత్వం ముందు తన హోదా కూడా గొప్ప కాదని తన అభిప్రాయమని పేర్కొన్నారు. రావిశాస్త్రి సూక్తులను విశాఖలో శాశ్వతంగా గుర్తుండేలా నిర్మించాలని సూచించారు. ఈనాటి సమాజం ఎక్కువగా గిరీషాలతో నిండి పోయిందని అప్పట్లోనే రావి శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారని.. ఇప్పటికీ అది యథార్థంగానే ఉందన్నారు. తెలుగు భాషను పరిరక్షించుకోవాలంటే మాండలిక భాషను వాడుకలో ఉంచాలని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. లా కంటే సమాజాన్ని ఎక్కువగా చదివిన న్యాయవాది రావి శాస్త్రి అని.. తాను కూడా లా కళాశాల తరగతి గదులకంటే సామాజిక అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టే వాడిని అని తెలిపారు.
ఆగస్టు 27 న పదవీరమణ చేయబోతున్న నేపథ్యంలో పనుల ఒత్తిడి ఉండటంఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానని.. విరమణ తర్వాత విశాఖ వచ్చి ఎక్కువ సమయం గడుపుతానని ఎన్వీ రమణ వెల్లడించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన రావిశాస్త్రి యారాడకొండపై రచన చేసి విశాఖపై తన మక్కువ చాటుకున్నారని తెలిపారు. రచయితగా ఆయన సృష్టించిన పాత్రలు చట్టాలు, శాసన వ్యవస్థల గురించి మాట్లాడాయని, వ్యవస్థలపై నమ్మకం పోతే ఏమవుతుందో తన రచనల్లో వివరించారని అన్నారు. సవ్యరీతిలో లేని, సరిగ్గా అమలుకాని చట్టాల గురించి తన రచనల్లో చెప్పారన్నారు. తీర్పుకు కేవలం సాక్ష్యాధారాలు మాత్రమే కాదు.. అందుకు దారి తీసిన పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని రావిశాస్త్రి చెప్పే వారని, ఇప్పుడదే చేస్తున్నామని ఎన్వీ రమణ పేర్కొన్నారు. నిజం హత్యకు గురైతే దేవుడే న్యాయం చేస్తాడని చెప్పే విధంగా రావిశాస్త్రి తన కథనాల్లో చెప్పే వారని.. రాజ్యధిక్కరణ కేసు సెక్షన్ 124 తాత్కాలిక రద్దు వెనక రావిశాస్త్రి ప్రభావం కూడా ఉందన్నారు. అప్పట్లోనే కాలం చెల్లిన ఇలాంటి చట్టాలు అవసరమా అని రావిశాస్త్రి చెప్పే వారన్నారు.
Also Read
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
Read Also: KA Paul: నన్ను ప్రధానిని చేస్తే దేశ దశ మార్చి చూపిస్తా..
అటు తెలుగు భాషను పరిరక్షించేందుకు అందరూ భాగస్వామ్యులు కావాలని ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. రావిశాస్త్రి తన రచనల్లో ప్రజల కష్టాలను, వారి జీవితాలను వివరించారని తెలిపారు. అప్పట్లో వారానికి ఒకసారి వచ్చే ‘రత్తాలు-రాంబాబు’ రచన కోసం ఎదురుచూసేవాళ్లమని ఎన్వీ రమణ గుర్తుచేసుకున్నారు. శతాబ్దాల కిందట ఒక రావి చెట్టు గౌతముడిని ప్రభావితం చేసిందని, ఈ శతాబ్దంలో ఒక ‘రావి’ సమాజాన్ని ప్రభావితం చేసిందని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
-
ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!