Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Chandrababu Naidu At Naravaripalle Focus On P4 Inequality And Rural Development

CM Chandrababu: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

Published Date :January 15, 2026 , 5:50 pm
By Sudhakar Ravula
  • నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
  • గతంలో గ్రామాలకు వెళ్లడానికి ప్రజలు భయపడ్డారు..
  • ఈ ఏడాది చాలా ఉత్సాహంగా స్వగ్రామాలకు వెళ్లి పండగ చేసుకున్నారు..
  • జన్మభూమిని ఎవరూ మర్చిపోకూడదు.
CM Chandrababu: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెలో పర్యటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం గ్రామాల్లో వాతావరణం పూర్తిగా మారిందని, ప్రజలు ఉత్సాహంగా స్వగ్రామాలకు వచ్చి పండుగలు జరుపుకుంటున్నారని తెలిపారు. ఒకప్పుడు గ్రామాలకు వెళ్లాలంటే భయం ఉండేదని, కానీ ఈ ఏడాది భోగి–సంక్రాంతి పండుగలను ప్రజలు ఎంతో ఆనందంగా తమ ఊళ్లలో జరుపుకున్నారని సీఎం చెప్పారు. జన్మభూమిని ఎవరూ మర్చిపోకూడదని, గ్రామాలతో ఉన్న అనుబంధమే మన సంస్కృతి అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల చదువుకుని ఉన్నత స్థితికి చేరుకున్నవారు చాలామంది ఉన్నారని, అయితే అదే సమయంలో జీవన ప్రమాణాల్లో అసమానతలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటికీ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని తెలిపారు. భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైనా, బిలియనీర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ అసమానతలు కూడా పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

Read Also: Indian Army Day 2026: సెల్యూట్ జవాన్! భారత సైనికులు మైనస్ 50 డిగ్రీల వద్ద ఎలా గస్తీ కాస్తారో తెలుసా?

Also Read

  • RK Roja: రాజకీయాలంటేనే టెన్షన్‌.. ఎమ్మెల్యే అయ్యాకే బీపీ, షుగర్‌ ఎటాక్..!
  • Chittoor Mayor Couple Murder Case: మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసు.. మరోసారి కోర్టు సీరియస్.. కలెక్టర్‌కు కీలక అదేశాలు..
  • AP Crime: పేకాటలో బాకీ వివాదం.. స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు..
  • Young Man D*ied with Heart Attack in Gym: జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి..

అసమానతలు తగ్గకపోతే సమాజంలో సంతృప్తి ఉండదని, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించినప్పుడే నిజమైన సమసమాజం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. అందుకే పీ4 కార్యక్రమం ద్వారా 10 లక్షల కుటుంబాలను దత్తత తీసుకుని పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2026 నుంచి ఈ కార్యక్రమంపై మరింత దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. కేవలం డబ్బు మాత్రమే కాకుండా, మేనేజ్‌మెంట్ స్కిల్స్ కూడా అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు స్వగ్రామంలోనే ఉండి స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నానని, భోగి, సంక్రాంతి వేడుకలను ప్రజలతో కలిసి జరుపుకున్నామని చెప్పారు. సంక్రాంతి రైతుల పండుగ అని, పంటలు ఇంటికి వచ్చినప్పుడు రైతు కుటుంబాలు ఆనందంగా గడుపుతాయని పేర్కొన్నారు. రైతులకు రూ.10 వేల కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించి వారి ముఖాల్లో ఆనందం తీసుకొచ్చామని తెలిపారు.

సంక్రాంతి రోజున పెద్దలను తలచుకుని నివాళులు అర్పించడం మన సంప్రదాయమని, పెద్దలను గుర్తు పెట్టుకోకపోతే వారసత్వమే ఉండదని చంద్రబాబు అన్నారు. కనుమ పండుగ సందర్భంగా ప్రకృతిని, పశువులను పూజించుకోవడం మన సంస్కృతికి నిదర్శనమని చెప్పారు. 2047 వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. 2029, 2039 నాటికి ఏం సాధించాలన్న దానిపై స్పష్టమైన టార్గెట్లతో ముందుకెళ్తున్నామని చెప్పారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఒక్కరి ఆదాయం, ఆరోగ్యం, ఆనందం పెరగాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తున్నామని అన్నారు. స్వర్ణ నారావారిపల్లె కార్యక్రమానికి గతేడాదే శ్రీకారం చుట్టామని, ఇక్కడ జీవన ప్రమాణాలు, ఆదాయం పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. రంగంపేట, కందులవారిపల్లె, చిన్నరామపురం పంచాయతీలను పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. గ్రామాల్లో ప్రత్యేక అధికారిని నియమించి మరుగుదొడ్లు, దీపం, పింఛన్లు వంటి పథకాలు అమలు చేస్తున్నామని, ఇల్లు లేని వారిని గుర్తించామని చెప్పారు. ఇంటి స్థలం ఉన్నా సొంత ఇల్లు లేని వారికి ఏడాది లోపే ఇళ్లు నిర్మిస్తామని, ఇంటింటికీ తాగునీటి సరఫరా కూడా అందించేలా చర్యలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chandrababu Naidu Naravaripalle
  • CM Chandrababu Remarks
  • P4 programme Andhra Pradesh
  • rural development AP
  • Swarna Andhra Vision 2047

తాజావార్తలు

  • Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

  • Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం

  • Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..

  • MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్

  • Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్‌లా కూల్‌గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions