Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
- బంగారుపాళ్యం కేంద్రంగా సాగిన అక్రమ లింగ నిర్ధారణ రాకెట్
- తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చిన గర్భిణీలు.. షాకింగ్ వివరాలు
- ఒక్కో పరీక్షకు రూ.10 వేలు.. జాయింట్ ఆపరేషన్లో గుట్టురట్టు
- నలుగురు అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరి కోసం గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో రహస్యంగా సాగుతున్న అక్రమ లింగ నిర్ధారణ పరీక్షల (Fetal Gender Determination) రాకెట్ గుట్టురట్టయింది. బంగారుపాళ్యం కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందాను తమిళనాడు వైద్యాధికారులు, చిత్తూరు పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన జాయింట్ ఆపరేషన్తో బట్టబయలు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, అందులోనే ఏకంగా స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసి ఈ అక్రమ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంట గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిని నిర్వాహకులు అద్దెకు తీసుకున్నారు. చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఆ ఇంట్లోనే ఏకంగా ఒక స్కానింగ్ మిషన్ను కొనుగోలు చేసి అమర్చారు. కేవలం స్థానికులే కాకుండా, సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా భారీగా గర్భిణీలు లింగ నిర్ధారణ పరీక్షల కోసం ఇక్కడికి వస్తున్నట్లు విచారణలో తేలింది. ఏజెంట్ల సహాయంతో గత కొంతకాలంగా ఈ నెట్వర్క్ అత్యంత రహస్యంగా సాగుతోంది.
Also Read
విశ్వసనీయ సమాచారంతో పోలీసులు, తమిళనాడు వైద్యాధికారులు ఒక్కసారిగా ఆ కేంద్రంపై దాడి చేశారు. పోలీసులు లోపలికి వెళ్లే సమయానికి సెంటర్లోనే ఏకంగా 15 మంది గర్భిణీలు పరీక్షల కోసం వేచి చూస్తూ కనిపించడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కడుపులో ఉన్న బిడ్డ ఆడ , మగ అని చెప్పడానికి ఒక్కో గర్భిణి నుంచి నిర్వాహకులు పది వేల రూపాయల (€10,000) వరకు వసూలు చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.
ఈ దాడిలో అక్రమంగా పరీక్షలు నిర్వహిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఉన్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడిన నిందితులపై తీవ్రమైన ‘లింగ నిర్ధారణ నిరోధక చట్టం’ (PCPNDT Act) కింద కేసులు నమోదు చేశారు. ఘటనా స్థలంలో ఉన్న స్కానింగ్ యంత్రాన్ని, ఇతర సాగ్రిగీలను అధికారులు స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?