Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
- బంగారుపాళ్యం కేంద్రంగా సాగిన అక్రమ లింగ నిర్ధారణ రాకెట్
- తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చిన గర్భిణీలు.. షాకింగ్ వివరాలు
- ఒక్కో పరీక్షకు రూ.10 వేలు.. జాయింట్ ఆపరేషన్లో గుట్టురట్టు
- నలుగురు అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరి కోసం గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో రహస్యంగా సాగుతున్న అక్రమ లింగ నిర్ధారణ పరీక్షల (Fetal Gender Determination) రాకెట్ గుట్టురట్టయింది. బంగారుపాళ్యం కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందాను తమిళనాడు వైద్యాధికారులు, చిత్తూరు పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన జాయింట్ ఆపరేషన్తో బట్టబయలు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, అందులోనే ఏకంగా స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసి ఈ అక్రమ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంట గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిని నిర్వాహకులు అద్దెకు తీసుకున్నారు. చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఆ ఇంట్లోనే ఏకంగా ఒక స్కానింగ్ మిషన్ను కొనుగోలు చేసి అమర్చారు. కేవలం స్థానికులే కాకుండా, సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా భారీగా గర్భిణీలు లింగ నిర్ధారణ పరీక్షల కోసం ఇక్కడికి వస్తున్నట్లు విచారణలో తేలింది. ఏజెంట్ల సహాయంతో గత కొంతకాలంగా ఈ నెట్వర్క్ అత్యంత రహస్యంగా సాగుతోంది.
Also Read
- NEET-UG 2026: నీట్- యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు.. ఆగస్టు 4 నుంచే..
- Danger Warnings: గోదావరి ఉగ్రరూపం.. ఆ జిల్లాలో కలకలం.. రంగంలోకి సహాయక బృందాలు..
- Low Rice Price: తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు.. రేపటి నుంచే అందుబాటులోకి...
- Local Elections In AP: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఆగస్టు 6న సమావేశం..
విశ్వసనీయ సమాచారంతో పోలీసులు, తమిళనాడు వైద్యాధికారులు ఒక్కసారిగా ఆ కేంద్రంపై దాడి చేశారు. పోలీసులు లోపలికి వెళ్లే సమయానికి సెంటర్లోనే ఏకంగా 15 మంది గర్భిణీలు పరీక్షల కోసం వేచి చూస్తూ కనిపించడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కడుపులో ఉన్న బిడ్డ ఆడ , మగ అని చెప్పడానికి ఒక్కో గర్భిణి నుంచి నిర్వాహకులు పది వేల రూపాయల (€10,000) వరకు వసూలు చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.
ఈ దాడిలో అక్రమంగా పరీక్షలు నిర్వహిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఉన్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడిన నిందితులపై తీవ్రమైన ‘లింగ నిర్ధారణ నిరోధక చట్టం’ (PCPNDT Act) కింద కేసులు నమోదు చేశారు. ఘటనా స్థలంలో ఉన్న స్కానింగ్ యంత్రాన్ని, ఇతర సాగ్రిగీలను అధికారులు స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర.. ముఠాను పట్టుకున్న పోలీసులు..
-
Operation Muskaan : ‘ఆపరేషన్ ముస్కాన్’ సక్సెస్.. 6,307 మంది చిన్నారులకు కొత్త జీవితం.!
-
Ayodhya: అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రం కలకలం.. విద్యార్థి అరెస్ట్!
-
Indore: పెళ్లైన కొన్ని గంటలకే విడాకులు.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే..!
-
Lenin : ఓటీటీలోకి అఖిల్ ‘లెనిన్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే!
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!