Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
- బంగారుపాళ్యం కేంద్రంగా సాగిన అక్రమ లింగ నిర్ధారణ రాకెట్
- తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చిన గర్భిణీలు.. షాకింగ్ వివరాలు
- ఒక్కో పరీక్షకు రూ.10 వేలు.. జాయింట్ ఆపరేషన్లో గుట్టురట్టు
- నలుగురు అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరి కోసం గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో రహస్యంగా సాగుతున్న అక్రమ లింగ నిర్ధారణ పరీక్షల (Fetal Gender Determination) రాకెట్ గుట్టురట్టయింది. బంగారుపాళ్యం కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందాను తమిళనాడు వైద్యాధికారులు, చిత్తూరు పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన జాయింట్ ఆపరేషన్తో బట్టబయలు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, అందులోనే ఏకంగా స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసి ఈ అక్రమ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంట గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిని నిర్వాహకులు అద్దెకు తీసుకున్నారు. చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఆ ఇంట్లోనే ఏకంగా ఒక స్కానింగ్ మిషన్ను కొనుగోలు చేసి అమర్చారు. కేవలం స్థానికులే కాకుండా, సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా భారీగా గర్భిణీలు లింగ నిర్ధారణ పరీక్షల కోసం ఇక్కడికి వస్తున్నట్లు విచారణలో తేలింది. ఏజెంట్ల సహాయంతో గత కొంతకాలంగా ఈ నెట్వర్క్ అత్యంత రహస్యంగా సాగుతోంది.
Also Read
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
విశ్వసనీయ సమాచారంతో పోలీసులు, తమిళనాడు వైద్యాధికారులు ఒక్కసారిగా ఆ కేంద్రంపై దాడి చేశారు. పోలీసులు లోపలికి వెళ్లే సమయానికి సెంటర్లోనే ఏకంగా 15 మంది గర్భిణీలు పరీక్షల కోసం వేచి చూస్తూ కనిపించడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కడుపులో ఉన్న బిడ్డ ఆడ , మగ అని చెప్పడానికి ఒక్కో గర్భిణి నుంచి నిర్వాహకులు పది వేల రూపాయల (€10,000) వరకు వసూలు చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.
ఈ దాడిలో అక్రమంగా పరీక్షలు నిర్వహిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఉన్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడిన నిందితులపై తీవ్రమైన ‘లింగ నిర్ధారణ నిరోధక చట్టం’ (PCPNDT Act) కింద కేసులు నమోదు చేశారు. ఘటనా స్థలంలో ఉన్న స్కానింగ్ యంత్రాన్ని, ఇతర సాగ్రిగీలను అధికారులు స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Brahmastra 2: ‘రామాయణం’ తర్వాత రణబీర్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?.. ద్విపాత్రాభినయంతో సిద్ధమవుతున్నాడా?
-
Myanmar Airstrike: బౌద్ధ మఠంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి.. 14 మంది మృతి
-
WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!