Chandrababu Tour: వరద ప్రాంతాల్లో నేడు, రేపు చంద్రబాబు పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈరోజు, రేపు గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, రాజోలు తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులకు భరోసా కల్పించనున్నారు. కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, రాజోలు తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను చంద్రబాబు పరామర్శిస్తారు. ముందుగా రాజమహేంద్రవరం (Rajamahendravaram) వెళ్లి అక్కడి నుంచి వరద ప్రాంతాల పర్యటనకు వెళ్తారు.
విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించాలని భావించినా పరిస్థితులు అనుకూలించడం లేదని టీడీపీ వర్గాలు తెలిపాయి. గోదావరి వరద (Godavari Floods) ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందడంలేదని ఇప్పటికే టీడీపీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ (Jaganmohan reddy) హెలికాప్టర్లో తిరిగితే సరిపోదంటున్నారు చంద్రబాబు. తమ ప్రభుత్వ హయాంలో విపత్తు నిర్వహణకు, ఇప్పటి అధికారుల నిబద్ధతకు తేడా ఏంటో చూడాలంటున్నారు చంద్రబాబునాయుడు.
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
మధ్యాహ్నం నాగుల్లంక నుంచి చంద్రబాబు వరద ప్రాంతాల పర్యటన ప్రారంభం అవుతుంది. ఉండవల్లి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని సిద్దాంతం మీదుగా ఆచంట మండలం కోడూరు చేరుకోనున్నారు చంద్రబాబు. అనంతరం లంక గ్రామాలైన అయోధ్య లంక, కోనసీమ జిల్లాలోని నాగులంకకు పడవ లో చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో కోనసీమ జిల్లాకు వెళ్లనున్నారు చంద్రబాబు. ఈనెల22వ తేదీన పాలకొల్లు, నర్సాపురం లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు.
బలహీనంగా ఉన్న ఏటిగట్లు పరిశీలించనున్నారు చంద్రబాబు. అటు యానాంలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ వరదల్లోనే వున్నాయి. ఇటు గోదావరికి వరద తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద క్రమేపీ తగ్గుతున్న గోదావరి వరదతో లంక గ్రామాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 14.50 అడుగులకు తగ్గింది వరద నీటిమట్టం. బ్యారేజీ నుండి 13 లక్షల 94 వేల క్యూసెక్కులు వరదనీరు సముద్రం లోకి విడుదల చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతూనే వుంది. 13.75 అడుగులకు తగ్గితే రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించనున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు.
Drunk And Driving: పాతబస్తీలో మందు బాబు హల్చల్.. పోలీసుల ముందే ప్యాంట్ విప్పి మరీ..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!