Chandrababu Tour: వరద ప్రాంతాల్లో నేడు, రేపు చంద్రబాబు పర్యటన
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈరోజు, రేపు గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, రాజోలు తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులకు భరోసా కల్పించనున్నారు. కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, రాజోలు తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను చంద్రబాబు పరామర్శిస్తారు. ముందుగా రాజమహేంద్రవరం (Rajamahendravaram) వెళ్లి అక్కడి నుంచి వరద ప్రాంతాల పర్యటనకు వెళ్తారు.
విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించాలని భావించినా పరిస్థితులు అనుకూలించడం లేదని టీడీపీ వర్గాలు తెలిపాయి. గోదావరి వరద (Godavari Floods) ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందడంలేదని ఇప్పటికే టీడీపీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ (Jaganmohan reddy) హెలికాప్టర్లో తిరిగితే సరిపోదంటున్నారు చంద్రబాబు. తమ ప్రభుత్వ హయాంలో విపత్తు నిర్వహణకు, ఇప్పటి అధికారుల నిబద్ధతకు తేడా ఏంటో చూడాలంటున్నారు చంద్రబాబునాయుడు.
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
మధ్యాహ్నం నాగుల్లంక నుంచి చంద్రబాబు వరద ప్రాంతాల పర్యటన ప్రారంభం అవుతుంది. ఉండవల్లి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని సిద్దాంతం మీదుగా ఆచంట మండలం కోడూరు చేరుకోనున్నారు చంద్రబాబు. అనంతరం లంక గ్రామాలైన అయోధ్య లంక, కోనసీమ జిల్లాలోని నాగులంకకు పడవ లో చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో కోనసీమ జిల్లాకు వెళ్లనున్నారు చంద్రబాబు. ఈనెల22వ తేదీన పాలకొల్లు, నర్సాపురం లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు.
బలహీనంగా ఉన్న ఏటిగట్లు పరిశీలించనున్నారు చంద్రబాబు. అటు యానాంలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ వరదల్లోనే వున్నాయి. ఇటు గోదావరికి వరద తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద క్రమేపీ తగ్గుతున్న గోదావరి వరదతో లంక గ్రామాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 14.50 అడుగులకు తగ్గింది వరద నీటిమట్టం. బ్యారేజీ నుండి 13 లక్షల 94 వేల క్యూసెక్కులు వరదనీరు సముద్రం లోకి విడుదల చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతూనే వుంది. 13.75 అడుగులకు తగ్గితే రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించనున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు.
Drunk And Driving: పాతబస్తీలో మందు బాబు హల్చల్.. పోలీసుల ముందే ప్యాంట్ విప్పి మరీ..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో