Chandrababu : పశువులు కూడా వీళ్లతో పోల్చితే ఒప్పుకోవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల సర్పంచులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు టీడీపీ అధినేత చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు, గుమ్మడి సంధ్యారాణి లు హజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు సర్పంచులకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ హయాంలో సర్పంచులకు స్వర్ణయుగంగా ఉండేదని, సర్పంచులకు చెక్ పవర్ ఇచ్చింది టీడీపీనేనని ఆయన అన్నారు. ఇప్పుడు గ్రామంలో మరుగుదొడ్లకు జగన్ రంగులు వేసుకుంటున్నారని, 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 7600 కోట్లు దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. గ్రామ సభ ఆమోదం లేకుండా నేరుగా నిధులు ఖర్చు పెట్టకూడదని, నరేగా పనుల్లో రూ. 260 కోట్లు అవినీతి అని కేంద్రం తేల్చిందన్నారు. ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని అమరావతి ఉద్యమాన్ని చూస్తే అర్ధం అవుతుందని ఆయన అన్నారు.
రాజధాని విషయంలో ఎందుకు మడమ తిప్పారో.. ఎందుకు మాట తప్పడో జగన్ చెప్పాలన్నారు. జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు.. రాజధాని ఇక్కడే అన్నారు. 3 క్యాపిటల్ అని ఇప్పుడు మూడు ముక్కల ఆట మొదలు పెట్టారు సీఎం జగన్. పశువులు కూడా వీళ్లతో పోల్చితే ఒప్పుకోవు. రాజధానిలో ఒకే వర్గం అని తప్పుడు ప్రచారం చేశారు అని ఆయన మండిపడ్డారు. ముంపు లేని చోట ముంపు అని ప్రచారం చేశారని, కృష్ణానది పక్కన ఉండే భూమిని స్మశానం అన్నారని, ఇలాంటి దుర్మార్గులు ఉంటారని పక్కాగా సీఆర్డీఏ చట్టం చేసామన్నారు. 807 రోజులు రైతులు ఆందోళన చేస్తే అవమానించారని, మహిళా రైతులు వీరోచితంగా పోరాడారన్నారు. పాదయాత్రకు వెళ్ళిన రైతులను ఎంత ఇబ్బందులు పెట్టారో అంతా చూశామని, తప్పుడు నిర్ణయాలతో జగన్ చరిత్ర హీనునుడిగా మిగిలిపోతారని విమర్శించారు. ఈ రోజు కోర్టు ద్వారా వచ్చిన విజయం 5 కోట్ల తెలుగు ప్రజలదని, రాజధాని ఉద్యమ రైతులకు, ప్రజలకు అభినందనలు తెలిపారు. సిగ్గు లేకుండా నాకు కులం అంట గడుతున్నారని, నాకు ఏ కులం లేదు.. పేదలే నా కులమని ఆయన అన్నారు.
Also Read
- Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
- TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
- AP Weather: సమ్మర్ను తలపిస్తున్న ఏపీ వాతావరణం.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. సీబీఐ దర్యాప్తు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!