Vijay Sai Reddy: ఆంధ్రప్రదేశ్లో 12 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో వివిధ కేసులకు సంబంధించి సత్వరం విచారణ సాగించేందుకు 12 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేశామన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు ఇచ్చారు. అత్యాచారం కేసులు, చిన్నారులపై జరిగే లైంగిక అత్యాచారం కేసులను (పోక్సో) త్వరతిగతిన పరిష్కరించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశలో 12 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.
క్రిమినల్ లా చట్టానికి అనుగుణంగా అత్యాచారం, పోక్సో కేసుల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద దేశంలో 1023 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని 2019 అక్టోబర్లో న్యాయ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో 728 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల కాలపరిమితిని ఒక ఏడాదికి మాత్రమే పరిమితం చేయాలని ముందుగా నిర్దేశించినా తదుపరి 2023 మార్చి 31 వరకు వీటిని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు 1,572 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది.
Also Read
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- Holiday: మొహర్రం ఏ రోజు.. సెలవు జూన్ 25నా.. జూన్ 26నా..?
CM KCR : పోలీసులందరికీ సెల్యూట్ చేస్తున్నా
అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 971 కోట్ల రూపాయలని మంత్రి తెలిపారు. నిర్భయ నిధుల నుంచి కేంద్రం తన వాటాను కేటాయిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ఏడాది జూన్ నాటికి దేశంలోని అన్ని ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులలో కలిపి లక్షకు పైగా కేసులను పరిష్కరించినట్లు మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పనితీరును మదింపు చేసిన నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ నివేదిక ప్రకారం మొత్తం పోక్సో కేసులలో 17.64% కేసులలో శిక్షలు విధించినట్లు తెలిపారు. ప్రత్యేక కోర్టులు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఆన్లైన్ మానిటరింగ్ పద్దతి ద్వారా నెలవారీ సమీక్షలు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో తమ మంత్రిత్వ శాఖ తరచుగా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తుస్తున్నట్లు మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
-
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!