NTV Telugu Site icon

రాజమండ్రికి కేంద్రం న్యూ ఇయర్ కానుక.. ఓఆర్‌ఆర్‌ మంజూరు..

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సర కానుక పంపింది.. రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ మంజూరు చేసింది కేంద్ర సర్కార్‌.. ఈ విషయాన్ని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ వెల్లడించారు.. కేంద్రం ఉత్తర్వులపై ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు.. రాజమండ్రి అభివృద్ధికి కేంద్రం న్యూ ఇయర్ కానుక ఇచ్చిందన్నారు.. రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ మంజూరైంది.. కేంద్ర ఉపరితల రవాణా శాఖ నుంచి ఉత్తర్వులు అందినట్టు తెలిపారు.. రాజమండ్రి చుట్టూ 25 నుంచి 30 కిలోమీటర్ల చుట్టూ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు.. ఇక, రాజమండ్రి చరిత్రలో ఇవాళ మరచిపోలేని రోజుగా అభివర్ణించిన ఎంపీ మార్గాని భరత్.. రాజమండ్రికి రింగ్ రోడ్ సాధించడం గర్వకారణంగా ఉందన్నారు.. సుమారు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో రాజమండ్రి రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు మార్గాని భరత్.