Buddha Venkanna: టీడీపీ బీసీ నేతలే జగన్కు దిక్కయ్యారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీలో పనిచేసిన బీసీ నేతలే సీఎం జగన్కు దిక్కయ్యారంటూ ఎద్దేవా చేశారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న.. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతల్ని ప్రజలు తరిమికొడుతున్నందుకే కొత్తగా బీసీ మంత్రుల బస్సు యాత్ర అంటున్నారు.. చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమానికి వస్తున్న స్పందనతో జగన్ బీసీ జపం అందుకున్నారని సెటైర్లు వేశారు. ఆర్.కృష్ణయ్య బీసీల కోసం పోరాటాలు చేశారా లేక తన పదవుల కోసం పోరాటం చేశారా..? అని ప్రశ్నించిన ఆయన.. టీడీపీ అమలు చేసిన ఎన్నో బీసీ సంక్షేమ పథకాలను వైసీపీ రద్దు చేసిందని.. వాటిని తిరిగి పునరుద్ధరించేలా జగన్ని ఒప్పించాకే ఆర్. కృష్ణయ్య రాజ్యసభ పదవి తీసుకుంటే మంచిదని సూచించారు. ఇక, ఇద్దరికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తే రాష్ట్రంలో బీసీల సంక్షేమం అమలు చేసినట్లేనా..? అని ప్రశ్నించిన బుద్దా వెంకన్న.. సీఎం జగన్ ఎన్ని కొంగ జపాలు చేసినా బీసీలంతా టీడీపీ పక్షానే ఉన్నారు.. త్వరలోనే బీసీ నేతలంతా సమావేశమై జగన్ బీసీ వ్యతిరేక డ్రామాలను ప్రజల్లో ఎండగడతామని ప్రకటించారు.
Read Also: Andhra Pradesh: బెండపూడి విద్యార్థుల ప్రతిభ.. సీఎం ఫిదా..
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
ఆర్.కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించిన విషయం మరిచారా..? అని నిలదీశారు బుద్దా వెంకన్న.. ఆర్. కృష్ణయ్యను తెచ్చి వైసీపీలో బీసీ నాయకులను అవమానించారన్న ఆయన.. కృష్ణయ్య టీడీపీ తరపున పోటీ చేసి గతంలో ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు. టీడీపీలో పని చేసిన బీసీ నేతలే జగన్కు దిక్కయ్యారన్న ఆయన.. ఏ పార్టీ నన్ను గుర్తించలేదని కృష్ణయ్య మాట్లాడటం వింతగా ఉందన్నారు. మంద కృష్ణ మాదిగ ఎప్పుడూ పదవులు గురించి మాట్లాడలేదే..? అని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప.. బీసీల మీద జగన్కి ప్రేమ లేదని.. కృష్ణయ్యకు ఎంపీ ఇస్తే.. బీసీలు అందరినీ ఉద్దరించినట్లు కాదన్నారు.. అదానీకి ఇచ్చిన విధంగా బీసీలకు ఆర్ధికంగా చేయూతను ఇవ్వండి అని సలహా ఇచ్చారు.
2019లో మీ పార్టీ కోసం పని చేసిన బీసీలెవరూ జగన్కు కనిపించ లేదా..? అని ప్రశ్నించారు వెంకన్న.. గడప గడపకూ వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారన్నారు.. అందుకే బీసీ మంత్రులతో బస్సు యాత్ర పేరుతో మూకుమ్మడిగా పంపిస్తున్నారు.. అంటే ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించే ప్రజల పై దాడి చేయాలని సంకేతాలా..? అని మండిపడ్డారు.. బీసీలకు అండగా ఉన్న నాయకులు ఎన్టీఆర్, చంద్రబాబులే.. అచ్చెంనాయుడిని పార్టీ అధ్యక్షులుగా చేశారు.. మీరు చేయలేదే..? అని నిలదీశారు.. సీఎం జగన్ కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్, పీకే రిపోర్ట్ రెండు ఉంటాయి.. బీసీలు చంద్రబాబు పాలన రావాలని కోరుకుంటున్నారు.. కోడిగుడ్లు, టమాటాలతో వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులకు ప్రజలు స్వాగతం పలుకుతున్నారని సెటైర్లు వేశారు బుద్దా వెంకన్న.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!