Buddha Venkanna: టీడీపీ బీసీ నేతలే జగన్కు దిక్కయ్యారు..!
టీడీపీలో పనిచేసిన బీసీ నేతలే సీఎం జగన్కు దిక్కయ్యారంటూ ఎద్దేవా చేశారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న.. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతల్ని ప్రజలు తరిమికొడుతున్నందుకే కొత్తగా బీసీ మంత్రుల బస్సు యాత్ర అంటున్నారు.. చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమానికి వస్తున్న స్పందనతో జగన్ బీసీ జపం అందుకున్నారని సెటైర్లు వేశారు. ఆర్.కృష్ణయ్య బీసీల కోసం పోరాటాలు చేశారా లేక తన పదవుల కోసం పోరాటం చేశారా..? అని ప్రశ్నించిన ఆయన.. టీడీపీ అమలు చేసిన ఎన్నో బీసీ సంక్షేమ పథకాలను వైసీపీ రద్దు చేసిందని.. వాటిని తిరిగి పునరుద్ధరించేలా జగన్ని ఒప్పించాకే ఆర్. కృష్ణయ్య రాజ్యసభ పదవి తీసుకుంటే మంచిదని సూచించారు. ఇక, ఇద్దరికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తే రాష్ట్రంలో బీసీల సంక్షేమం అమలు చేసినట్లేనా..? అని ప్రశ్నించిన బుద్దా వెంకన్న.. సీఎం జగన్ ఎన్ని కొంగ జపాలు చేసినా బీసీలంతా టీడీపీ పక్షానే ఉన్నారు.. త్వరలోనే బీసీ నేతలంతా సమావేశమై జగన్ బీసీ వ్యతిరేక డ్రామాలను ప్రజల్లో ఎండగడతామని ప్రకటించారు.
Read Also: Andhra Pradesh: బెండపూడి విద్యార్థుల ప్రతిభ.. సీఎం ఫిదా..
Also Read
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
- AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- AP SSC Results 2026: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. పెరిగిన ఉత్తీర్ణత..
ఆర్.కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించిన విషయం మరిచారా..? అని నిలదీశారు బుద్దా వెంకన్న.. ఆర్. కృష్ణయ్యను తెచ్చి వైసీపీలో బీసీ నాయకులను అవమానించారన్న ఆయన.. కృష్ణయ్య టీడీపీ తరపున పోటీ చేసి గతంలో ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు. టీడీపీలో పని చేసిన బీసీ నేతలే జగన్కు దిక్కయ్యారన్న ఆయన.. ఏ పార్టీ నన్ను గుర్తించలేదని కృష్ణయ్య మాట్లాడటం వింతగా ఉందన్నారు. మంద కృష్ణ మాదిగ ఎప్పుడూ పదవులు గురించి మాట్లాడలేదే..? అని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప.. బీసీల మీద జగన్కి ప్రేమ లేదని.. కృష్ణయ్యకు ఎంపీ ఇస్తే.. బీసీలు అందరినీ ఉద్దరించినట్లు కాదన్నారు.. అదానీకి ఇచ్చిన విధంగా బీసీలకు ఆర్ధికంగా చేయూతను ఇవ్వండి అని సలహా ఇచ్చారు.
2019లో మీ పార్టీ కోసం పని చేసిన బీసీలెవరూ జగన్కు కనిపించ లేదా..? అని ప్రశ్నించారు వెంకన్న.. గడప గడపకూ వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారన్నారు.. అందుకే బీసీ మంత్రులతో బస్సు యాత్ర పేరుతో మూకుమ్మడిగా పంపిస్తున్నారు.. అంటే ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించే ప్రజల పై దాడి చేయాలని సంకేతాలా..? అని మండిపడ్డారు.. బీసీలకు అండగా ఉన్న నాయకులు ఎన్టీఆర్, చంద్రబాబులే.. అచ్చెంనాయుడిని పార్టీ అధ్యక్షులుగా చేశారు.. మీరు చేయలేదే..? అని నిలదీశారు.. సీఎం జగన్ కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్, పీకే రిపోర్ట్ రెండు ఉంటాయి.. బీసీలు చంద్రబాబు పాలన రావాలని కోరుకుంటున్నారు.. కోడిగుడ్లు, టమాటాలతో వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులకు ప్రజలు స్వాగతం పలుకుతున్నారని సెటైర్లు వేశారు బుద్దా వెంకన్న.
తాజావార్తలు
-
Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..
-
AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
-
AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?