బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. నేడు మఠం పీఠాధిపతి సమస్యను పరిష్కారం చేసేందుకు వస్తున్నారు పీఠాధిపతులు. కానీ వారి రాకను వ్యతిరేకిస్తున్నారు రెండో భార్య మహాలక్ష్మి. మొదటి భార్య పెద్ద కొడుకు వెంకటాద్రికే మొగ్గు చూపుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. వారు మఠం సందర్శనకు రావడానికి ఎలాంటి హక్కు లేదని అంటున్నారు. ఇక నుంచి శ్రీ బ్రహ్మంగారి మఠంను శివ మఠం గా మారుస్తారా… లేని గొడవలు సృష్టించేందుకే పీఠాధిపతులు వస్తున్నారు. పూర్వ పీఠాధిపతి నిర్ణయం గౌరవిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆమోదంతో మఠంను పరిపాలించ గలరని ఆశిస్తున్నాను. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామితో పాటు పీఠాధిపతుల పై డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేసారు రెండో భార్య మహాలక్ష్మి.