Boy Killed Brother: చేపల విషయంలో గొడవ.. తమ్ముడ్ని చంపిన అన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boy Killed His Brother In Kakinada Over Catching Fish: ఒకప్పుడు ప్రజలు కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎన్ని సమస్యలు వచ్చినా.. ఐక్యంగా ఉంటూ, ఆ సమస్యల్ని సామరస్యంగా పరిష్కించుకునేవారు. కానీ.. రానురాను మనుషుల్లో మార్పు వచ్చేసింది. కుటుంబ విలువల్ని పక్కనపెట్టేసి, పోటీతత్వం పెంచుకున్నారు. క్రమంగా ఆ పోటీ గొడవలుగా మారాయి. ఇప్పుడు అయినవారినే కాటికి చేర్చడానికి వెనుకాడటం లేదు. ‘నువ్వెంత-నువ్వెంత’ అంటూ వివాదాలకు దిగి.. పగలు, ప్రతీకారాలు పెంచుకుని.. చంపుకుంటున్నారు. తాజాగా కాకినాడలో తన తమ్ముడ్నే ఓ అన్నయ్య చంపేశాడు. చేపలు పట్టుకునే విషయంలో గొడవ ఏర్పడటంతో.. ఆ అన్న ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Tirupati Crime: ప్రియుడి ఘాతుకం.. ప్రేమ వివాహానికి అంగీకరించలేదని..
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమురులో అబ్బులు, వంశీ అనే ఇద్దరు సోదరులున్నారు. వీళ్లిద్దరు కలిసి చెరువు దగ్గర చేపలు పట్టడానికి వెళ్లారు. అయితే.. చేపలు పట్టుకునే విషయంలో ఇద్దరి మధ్య వివాదం రేగింది. దీంతో కోపాద్రిక్తుడైన వంశీ.. తన సోదరుడు అబ్బులుని చెరువులో తోసేశాడు. అతడు నీటిలో మునిగి, ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భయపడిన వంశీ.. తమ్ముడు చనిపోయిన విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా దాచిపెట్టాడు. మరోవైపు.. అబ్బులు కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులు అతని కోసి గాలించారు. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరగా అతడు చెరువు దగ్గరికి వెళ్లడానికి సమాచారం తెలియడంతో.. అక్కడికి వెళ్లి వెతికారు. అప్పుడు పోలీసులకు అతని మృతదేహం చెరువులో కనిపించగా, బాడీని బయటకు తీశారు.
ATM AC Robbery: ఏటీఎం మెషిన్, డబ్బు వదిలేసి.. ఏసీ ఎత్తుకెళ్లిపోయిన దుండగులు!
తన అన్నయ్య వంశీతోనే కలిసి అబ్బులు చెరువుకి వచ్చాడు కాబట్టి.. వంశీని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. దాంతో అతడు అసలు నిజం చెప్పేశాడు. చేపలు పట్టుకునే విషయంలో గొడవ నెలకొనడంతో.. తానే సోదరుడ్ని చంపేశానని ఒప్పుకున్నాడు. అన్నయ్యే తమ్ముడ్ని చంపాడన్న విషయం తెలిసి.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!